News June 12, 2024

కందుల దుర్గేశ్ అను నేను..

image

కాంగ్రెస్ నుంచి రాజకీయాల్లోకి వచ్చిన దుర్గేశ్ వివిధ హోదాల్లో పనిచేసి MLC అయ్యారు. తూ.గో. జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు. 2014లో రాజమండ్రి MPగా బరిలో నిలిచి ఓడిపోయారు. 2016లో వైసీపీలో చేరారు. ఆ తర్వాత 2018లో జనసేనలో చేరి 2019లో రాజమండ్రి గ్రామీణం నుంచి MLAగా పోటీచేసి ఓటమి చెందారు. తాగా ఎన్నికల్లో నిడదవోలు నుంచి 33,304 ఓట్ల మెజారిటీతో గెలుపొంది మంత్రిగా స్థానం సంపాదించుకున్నారు.

Similar News

News November 3, 2025

శివాలయాలు, ఘాట్ల వద్ద పోలీసు బందోబస్తు పెంపు: ఎస్పీ

image

కార్తీక మాసం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న శివాలయాలు, ఇతర ఆలయాల వద్ద, ఘాట్ల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ నర్సింగ్ కిషోర్ సోమవారం తెలిపారు. కాశీబుగ్గ ఆలయంలో జరిగిన సంఘటనను దృష్టిలో ఉంచుకుని, భక్తులు రద్దీగా ఉండే ప్రదేశాలలో భద్రత దృష్ట్యా పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. భక్తులు భద్రతా నిబంధనలు పాటించాలని కోరారు.

News November 3, 2025

మండలిలో బీజేపీ ఫ్లోర్ లీడర్‌గా సోము వీర్రాజు

image

బీజేపీ నేత, ఎమ్మెల్సీ సోము వీర్రాజుకు బీజేపీ కీలక బాధ్యతలు అప్పగించింది. రాష్ట్ర శాసనమండలిలో బీజేపీ ఫ్లోర్ లీడర్‌గా అధిష్ఠానం ఆయనను నియమించింది. ఎమ్మెల్యే కోటా ద్వారా మండలిలోకి వచ్చిన వీర్రాజు ఇకపై పార్టీ కార్యకలాపాలను పర్యవేక్షించనున్నారు. ఇప్పటివరకు ఫ్లోర్ లీడర్ లేకపోవడంతో, ఆయన సీనియారిటీని దృష్టిలో ఉంచుకుని ఈ కీలకపదవిని కేటాయించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

News November 3, 2025

మండలిలో బీజేపీ ఫ్లోర్ లీడర్‌గా సోము వీర్రాజు

image

బీజేపీ నేత, ఎమ్మెల్సీ సోము వీర్రాజుకు బీజేపీ కీలక బాధ్యతలు అప్పగించింది. రాష్ట్ర శాసనమండలిలో బీజేపీ ఫ్లోర్ లీడర్‌గా అధిష్ఠానం ఆయనను నియమించింది. ఎమ్మెల్యే కోటా ద్వారా మండలిలోకి వచ్చిన వీర్రాజు ఇకపై పార్టీ కార్యకలాపాలను పర్యవేక్షించనున్నారు. ఇప్పటివరకు ఫ్లోర్ లీడర్ లేకపోవడంతో, ఆయన సీనియారిటీని దృష్టిలో ఉంచుకుని ఈ కీలకపదవిని కేటాయించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.