News July 10, 2024

కంభం: పది రోజుల్లో ముగ్గురు మృతి

image

జంగంగుంట్ల- కంభం హైవే రోడ్డు ప్రమాదాలకు నిలయంగా మారింది. ఈ ప్రాంతంలో నిత్యం ఏదో ఒక చోట రోడ్డు ప్రమాదం జరుగుతూనే ఉందని వాహనదారులు అంటున్నారు. గత పది రోజుల్లో ముగ్గురు మృతి చెందగా, ఆరుగురు తీవ్రగాయాల బారిన పడ్డారు. ట్రాఫిక్ ఎక్కువగా ఉండటం, రోడ్డు వెడల్పు తక్కువ, మలుపులు వంటివి ప్రమాదాలకు కారణాలుగా తెలుస్తోంది. రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తే ప్రమాదాలను అరికట్టవచ్చని పోలీసులు సూచిస్తున్నారు.

Similar News

News September 14, 2025

SP దామోదర్‌కు వీడ్కోలు

image

ప్రకాశం జిల్లా SP దామోదర్ ఐపీఎస్ విజయనగరానికి బదిలీ అయ్యారు. ఒంగోలు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆదివారం వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహించారు. 14 నెలల పాటు SPగా విశేష కృషి చేశారని పోలీస్ అధికారులు కొనియాడారు. ప్రత్యేక వాహనంలో వెళ్లిన దామోదర్‌కు పోలీసులు గౌరవ సెల్యూట్ చేశారు. పోలీస్ అధికారులు ఘనంగా వీడ్కోలు పలికారు.

News September 14, 2025

బీజేపీలో చేరిన ఎమ్మెల్సీ పోతుల సునీత!

image

ఎమ్మెల్సీ పోతుల సునీత ఆదివారం BJPలో చేరారు. విశాఖలో జరుగుతున్న సారథ్యం సభలో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆమెకు పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు. ఏపీలో ఎన్నికల అనంతరం వైసీపీకి దూరంగా ఉన్న పోతుల సునీత BJPలో చేరడం చర్చనీయాంశంగా మారింది.

News September 14, 2025

కందుకూరు: కరేడులో టెన్షన్..టెన్షన్..

image

ఉమ్మడి ప్రకాశం జిల్లా ఉలవపాడు (M) కరేడులో ఆదివారం అంతటా ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ఆంక్షల నడుమ బోడె రామచంద్ర యాదవ్ మీటింగ్ జరగాల్సి ఉండటంతో పరిణామాలు ఎలా దారి తీస్తాయో అన్న టెన్షన్ అందరిలో ఏర్పడింది. జూలై 29న జరిగిన హైవే దిగ్బంధం కార్యక్రమంలో కూడా బోడె రామచంద్ర వెంట అనూహ్యంగా వేలాది మంది కరేడు ప్రజలు దూసుకొచ్చిన ఘటన తెలిసిందే. ఇప్పుడు ఏం జరుగుతుందో అన్న టెన్షన్ సర్వత్రా నెలకొంది.