News November 22, 2024

కడపలోని ఏపీజీబీని అమరావతికి తరలించవద్దు 

image

కడప నగరం కేంద్రంగా ఉన్న ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ అమరావతికి తరలిపోతుందని వార్త జిల్లావ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్న తరుణంలో గురువారం సీఎం చంద్రబాబును కడప జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస రెడ్డి కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ బ్యాంక్‌ను కడప కేంద్రంగానే కొనసాగించాలని ఉద్యోగులు, ప్రజల తరుపున విన్నవించారు. గ్రామీణ ప్రజలకు సేవలు అందిస్తున్న ఈ బ్యాంక్‌ను ఎట్టి పరిస్థితుల్లో తరలించవద్దన్నారు.

Similar News

News October 31, 2025

వచ్చేనెల 7న వైవీయూ అంతర కళాశాలల క్రీడల పోటీలు

image

నవంబరు 7న అంతర కళాశాలల క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు వైవీయూ వ్యాయామ విద్య, క్రీడా శాస్త్రాల బోర్డు కార్యదర్శి డా.రామసుబ్బారెడ్డి గురువారం తెలిపారు. పురుషులు, మహిళలకు రోలర్ స్కెటింగ్, రైఫిల్ షూటింగ్, యోగా, టేబుల్ టెన్నిస్ పోటీలు ఉంటాయన్నారు. ఆసక్తి గల క్రీడాకారులు వారి ఒరిజినల్ స్టడీ సర్టిఫికేట్లపై ప్రిన్సిపల్‌తో అటెస్టేషన్ చేయించుకోవాలన్నారు. వయసు 17-25 ఏళ్ల మధ్య ఉండాలని పేర్కొన్నారు.

News October 30, 2025

PGRS ఫిర్యాదుల పరిష్కారానికి కృషి చేయాలి: RDO

image

PGRS ఫిర్యాదుల పరిష్కారానికి కృషి చేయాలని కడప RDO జాన్ ఇర్విన్ రెవెన్యూ సిబ్బందిని ఆదేశించారు. సిద్దవటం MRO కార్యాలయంలో గురువారం PGRSపై సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ప్రజా వేదికలో ఫిర్యాదు చేసిన ఫిర్యాదు దారులతో RDO చరవాణిలో మాట్లాడారు. అలాగే ఆయన గోల్డెన్ రికార్డ్స్, రీసర్వేపై సిబ్బందికి సూచనలు, సలహాలు ఇచ్చారు.

News October 30, 2025

రైలు కిందపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి

image

కొండాపురంలోని పాత కొండాపురం సమీపంలో చిత్రావతి నది వంతెన సమీపంలో గురువారం రైలు కిందపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల వివరాల మేరకు.. అతను రైలు కింద పడడంతో అతని తల, మొండెం రెండు భాగాలుగా విడిపోయాయి. మృతుడి ఒంటిపై పసుపు కలర్ చొక్కా, బ్లూ కలర్ పాయింట్ ఉన్నాయి. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.