News January 2, 2025

కడపలో టీడీపీ MLC ఇంటికి బొత్స

image

టీడీపీ MLC రామచంద్రయ్య కుటుంబాన్ని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ పరామర్శించారు. ఇటీవల రామచంద్రయ్య కుమారుడు విష్ణు స్వరూప్ అకాల మరణం చెందారు. ఈ నేపథ్యంలో కడప కో-ఆపరేటివ్ కాలనీలో ఆయన నివాసంలో బొత్స సత్యనారాయణ రామచంద్రయ్యతో పాటు వారి కుటుంబ సభ్యులను గురువారం పరామర్శించారు. చిన్న వయసులోనే అకాల మరణం చెందడం బాధాకరమని వారి కుటుంబానికి దేవుడు మనోధైర్యం ఇవ్వాలని ఆకాంక్షించారు.

Similar News

News November 5, 2025

VZM: పీజీ పరీక్షల్లో ముగ్గురు విద్యార్థులు డిబార్

image

ఏయూ పీజీ పరీక్షలలో ముగ్గురు విద్యార్థులను డిబార్ చేశారు. మంగళవారం ప్రారంభమైన పీజీ పరీక్షల్లో విజయనగరం జిల్లా ఎస్.కోట చైతన్య డిగ్రీ కళాశాలలో కెమిస్ట్రీ మూడో సెమిస్టర్ పరీక్షలు రాసిన ముగ్గురు విద్యార్థులు మాల్ ప్రాక్టీస్‌కి పాల్పడుతున్నట్లు విశ్వవిద్యాలయంకి వెళ్లిన తనిఖీ బృందం గుర్తించింది. దీంతో ఈ విద్యార్థులను అధికారులు డిబార్ చేశారు. నిరంతరం తనిఖీలు నిర్వహిస్తామని ఏ.యూ స్పష్టం చేసింది.

News November 5, 2025

పెట్టుబడులపై అవగాహన కల్పించండి: మంత్రి కొండపల్లి

image

విదేశీ పెట్టుబడులను ఆకర్షించే విధానాల అమలు, తదితర అంశాలపై అధికారులతో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అమరావతి సచివాలయంలో మంగళవారం సమీక్ష నిర్వహించారు. వివిధ దేశాల్లో కీలక స్థానాల్లో ఉన్న తెలుగు ఎన్నారైలతో ప్రత్యేక క్లబ్ ఏర్పాటు చేయాలని సూచించారు. రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలు, ప్రభుత్వ ప్రోత్సాహకాలు, పారిశ్రామిక విధానం వివరించి వారికి పెట్టుబడులపై అవగాహన కల్పించాలని అన్నారు.

News November 4, 2025

VZM: ఈ నెల 6న జడ్పీ సర్వ సభ్య సమావేశం

image

జిల్లా ప్రజా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం ఈనెల 6న ఉదయం 11 గంటలకు జిల్లా పరిషత్ సమావేశ భవనంలో జరుగనుందని CEO సత్యనారాయణ మంగళవారం తెలిపారు. అక్టోబర్ 29న నిర్వహించాల్సిన సమావేశాన్ని తుఫాన్ కారణంగా వాయిదా వేశామన్నారు. జిల్లా పరిషత్ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు నవంబర్ 6న సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్లు చెప్పారు.