News March 31, 2024
కడపలో పాగా వేసేది ఎవరు.?

జిల్లా రాజకీయాల్లో కడప అసెంబ్లీకి ప్రత్యేక స్థానం ఉంది. 3 దశాబ్దాల నుంచి ముస్లింలకు కంచుకోటగా మారిన కడప నుంచి సిట్టింగ్ MLA అంజాద్ బాషా వైసీపీ నుంచి బరిలో ఉన్నారు. ఇటు కూటమి నుంచి మహిళా అభ్యర్థి మాధవిరెడ్డి మొదటిసారి పోటీ చేస్తున్నారు. కడపలో గెలిచి చరిత్ర సృష్టిస్తానని మాధవిరెడ్డి అంటుంటే, ఈసారి కూడా గెలిచి హ్యాట్రిక్ విజయం సాధిస్తానని అంజాద్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి ఇక్కడ గెలుపు ఎవరిది.?
Similar News
News February 20, 2026
శనగల కొనుగోలు కేంద్రాలు సద్వినియోగం చేసుకోండి: JC

జిల్లాలో ఏర్పాటు చేసిన 21 శనగ కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ డా. నిధి మీనా సూచించారు. రాజుపాలెం మండలంలోని రైతు సేవా కేంద్రం, ప్రొద్దుటూరు వ్యవసాయ మార్కెట్ కమిటీలో శనగ కొనుగోలు కేంద్రాలను ఆమె పరిశీలించారు. రైతులు శనగ పంటను బాగా ఆరబెట్టి, శుభ్రపరిచి, తేమ శాతం 14% లోపు ఉండేలా చూసుకుని కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు. కొనుగోలుపై అధికారులు వివరించారు
News February 20, 2026
కడప జిల్లాలో శనగ కొనుగోలు కేంద్రాలు ఇవే:

జిల్లాలో 21 శనగ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు JC నిధిమీనా తెలిపారు. పులివెందుల, తొండూరు, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, కమలాపురం, పెద్దముడియం, ఎర్రగుంట్ల, ముద్దనూరు, మైలవరం, కొండాపురం, రాజుపాలెం, దువ్వూరు, వల్లూరు, పెండ్లిమర్రి, సింహాద్రిపురం, V.Nపల్లె, వేముల, వేంపల్లె, లింగాల, పోరుమామిళ్లలో శనగ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇక్కడ రైతుల నుంచి క్వింటా శనగను రూ.5,875తో కొనుగోలు చేస్తామన్నారు.
News February 20, 2026
మార్చి 13న YVU కాన్వకేషన్.. VC సమీక్ష

మార్చి 11న నిర్వహించనున్న వైవీయూ కాన్వకేషన్ విజయవంతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వి.సి ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్ స్పష్టం చేశారు. ఒకేసారి 11వ, 12వ 13వ 14వ కాన్వకేషన్ నిర్వహించాల్సి రావడం వల్ల అత్యంత జాగ్రత్తతో ఎవరి విధులను వాళ్లు నిర్వర్తించాల్సి ఉంటుందన్నారు. కాన్వకేషన్ నిర్వహణకు సంబంధించి 14 కమిటీల కన్వీనర్లతో గురువారం వైస్ ఛాన్సలర్ తన ఛాంబర్లో సమావేశమై చర్చించారు.


