News October 9, 2024

కడపలో వాసవి అమ్మవారికి బిందె సేవ

image

కడప నగరంలో దేవి శరన్నవరాత్రి వేడుకలు బుధవారం అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. కడప శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవి ఆలయం అమ్మవారి శాలలో దసరా వేడుకలు అట్టహాసంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా.. బుధవారం మూలా నక్షత్రం సందర్భంగా బిందె సేవ నిర్వహించారు. ముందుగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం బిందె సేవలో బిందెె సేవలో భాగంగా అమ్మవారిని ఊరేగించారు.

Similar News

News October 9, 2024

ముద్దనూరు వద్ద రైలు ఢీ.. యువకుడు మృతి

image

రైలు కిందపడి యువకుడు మృతి చెందిన ఘటన బుధవారం ముద్దనూరులో చోటుచేసుకుంది. ఎర్రగుంట్ల రైల్వే హెడ్‌ కానిస్టేబుల్‌ రామిరెడ్డి వివరాల ప్రకారం.. ముద్దనూరు మండలంలోని చింతకుంట సమీపంలో రైలు కిందపడి గుండి నాగేంద్ర (22) మృతి చెందాడు. ఇతను డ్రైవర్‌‌గా జీవనం సాగిస్తారన్నారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతికి గల విరాలు తెలియాల్సిఉంది.

News October 9, 2024

కడప: జ్యోతి క్షేత్ర సమస్య కేంద్ర అటవీ శాఖ మంత్రి దృష్టికి

image

గత కొన్ని సంవత్సరాలుగా నిరాశ్రయులకు, భక్తులకు నిరంతరం అన్నదానం చేస్తున్న కాశినాయన క్షేత్రంలోని ఆలయ నిర్మాణాలను, అటవీ శాఖ అధికారులు అడ్డుకుంటున్నారు. ఈ విషయాన్ని హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ యాదవ్ దృష్టికి తీసుకువెళ్లడంతో ఆయన బుధవారం కేంద్ర అటవీశాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌ను కలసి జ్యోతిక్షేత్ర ప్రాముఖ్యతను వివరించారు. భక్తుల మనోభావాలను దెబ్బతీయకుండా ఆలయ అభివృద్ధికి సహకరించాలని కోరారు.

News October 9, 2024

కడప జిల్లాలో అక్రమ రిజిస్ట్రేషన్లు రద్దు

image

వైఎస్సార్ జిల్లాలో భూముల అక్రమ రిజిస్ట్రేషన్లపై కలెక్టర్ శివశంకర్ కన్నెర్ర చేశారు. జిల్లా వ్యాప్తంగా 57 అక్రమ రిజిస్ట్రేషన్లను రద్దు చేసినట్లు ప్రకటించారు. ముద్దనూరులో 53, జమ్మలమడుగు, ఎర్రగుంట్లలో 4 అక్రమంగా చేయగా.. వీటిని ముద్దనూరు ఇన్‌ఛార్జ్ సబ్ రిజిస్ట్రార్ అక్రమ రిజిస్ట్రేషన్ చేసినట్లు విచారణలో గుర్తించామన్నారు.