News July 19, 2024
కడప: అగమ్యగోచరంగా 100 ప్రభుత్వ పాఠశాలలు

జిల్లాలోని పలు ప్రాథమిక పాఠశాలల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని పలువురు ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లాలో మొత్తం 1,861 ప్రాథమిక పాఠశాలలు ఉండగా, 88,164 మంది విద్యార్థులు చదువుతున్నారు. 2024-25 విద్యా సంవత్సరంలో 100పైగా పాఠశాలల్లో ఇప్పటి వరకు ఒక్క విద్యార్థి కూడా చేరలేదు. ఈ పాఠశాలల భవిష్యత్ ఆందోళనగా మారింది. గత ప్రభత్వం తెచ్చిన జీవో.నం 117 వల్లే ఈ పరిస్థితి నెలకొందని పలువురు వాపోయారు.
Similar News
News November 10, 2025
కడప శ్రీ చైతన్యలో విద్యార్థిని ఆత్మహత్య

కడప శ్రీ చైతన్య బాలికల రెసిడెన్షియల్ స్కూల్లో తొమ్మిదో తరగతి బాలిక జస్వంతి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. విద్యార్థిని పులివెందుల వాసిగా సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News November 10, 2025
ఎర్రగుంట్లలోని ఆలయంలో హీరో సుమన్ సందడి

ఎర్రగుంట్ల (M) కలమల్ల గ్రామంలోని చెన్నకేశవ స్వామి ఆలయంలో సినీ హీరో సుమన్ సందడి చేశారు. అక్కడ ఉన్న పురాతన తొలి తెలుగు శాసనాన్ని పరిశీలించారు. తెలుగు శాసనాన్ని కట్టుదిట్టంగా ఏర్పాటు చేయడానికి తనవంతు కృషి చేస్తానన్నారు. ఆయన వెంట ఆలయాధికారులు, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.
News November 10, 2025
మైదుకూరు: ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

మైదుకూరు మండలం జీవి సత్రం హైవే రోడ్డ పైన గుర్తు తెలియని వాహనం ఢీకొని ఇద్దరు యువకులు మృతి చెందారు. ఇద్దరు యువకులు కడపకు చెందిన సంజయ్, సంతోశ్ అని స్థానికులు గుర్తించారు. మృత దేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


