News October 11, 2024

కడప: ‘అధికారుల దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరించాలి’

image

గ్రామోదయం, నగరోదయం కార్యక్రమాలలో అధికారుల దృష్టికి వచ్చిన సమస్యలను వేగంగా పరిష్కరించాలని కలెక్టర్ శివ శంకర్ లోతేటి అధికారులను ఆదేశించారు. కలెక్టర్లతో గురువారం క్షేత్రస్థాయి అధికారులలో ఆయన సమీక్ష నిర్వహించారు. ప్రజల నుంచి వచ్చిన ప్రతి అర్జీని పరిష్కరించినప్పుడే గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాలు ఏర్పడతాయని, అభివృద్ధి చెందుతాయని ఆయన పేర్కొన్నారు.

Similar News

News October 11, 2024

సిద్దవటంలో ఘోర రోడ్డు ప్రమాదం

image

సిద్దవటం మండలం మాధవరం ఎస్కే నగర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కడపకు వెళుతున్న ఆటో ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేయబోతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంలో గాయ పడిన ఆటో డ్రైవర్, చిన్న పాపను హుటాహుటిన రిమ్స్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News October 10, 2024

రైల్వేకోడూరు: రేబీస్ వ్యాధితో మహిళ మృతి

image

ఉమ్మడి కడప జిల్లాలో విషాద ఘటన వెలుగు చూసింది. రైల్వే కోడూరు మండలం ఎ.బుడగుంటపల్లి పంచాయతీ వికాస్ నగర్‌కు చెందిన పులికి మునిలక్ష్మి(35)ని ఆమె పెంచుకున్న పెంపుడు కుక్క కాటేసింది. ఈక్రమంలో ఆమెకు రేబీస్ వ్యాధి సోకింది. చికిత్స పొందుతూ గురువారం ఉదయం చనిపోయారు. మృతురాలికి ఇద్దరు కుమారులు ఉన్నారు. పెంపుడు, వీధి కుక్కలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డాక్టర్లు సూచించారు.

News October 10, 2024

కడప: నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్.. ముగ్గురిపై కేసు

image

కడప జిల్లాలో నకిలీ పత్రాలు సృష్టించి భూములను రిజిస్ట్రేషన్ చేయించుకున్న హెడ్ కానిస్టుబుల్‌తో సహా ముగ్గురిపై తాలూకా పోలీసులు కేసు నమోదు చేశారు. అక్కాయపల్లెలో 15సెంట్ల స్థలానికి సంబంధించి హెడ్ కానిస్టేబుల్ బాషాతో పాటు రామకృష్ణ, రామాంజనేయరెడ్డి నెల్లూరుకు చెందిన శివకృష్ణ అనే వ్యక్తిని బెదిరించడంతో అతడు ఫిర్యాదు చేశాడు. అక్రమ రిజిస్ట్రేషన్లపై కలెక్టర్ సీరియస్ అవ్వడంతో కేసులు నమోదు చేస్తున్నారు.