News December 12, 2024

కడప: ‘ఈనెల 15 లోపు పంటల బీమా ప్రీమియం చెల్లించాలి’

image

రైతులు ఈనెల 15వ తేదీ లోపు పంటల బీమా ప్రీమియం చెల్లించాలని జిల్లా వ్యవసాయ శాఖాధికారి ఐతా నాగేశ్వరరావు అన్నారు. చింతకొమ్మదిన్నె మండలం బుగ్గలపల్లె, బోడెద్దులపల్లెలో బుధవారం నిర్వహించిన పొలం పిలుస్తోంది కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వరికి ఈ నెల 31వ తేదీ వరకు ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించుటకు అవకాశం ఉందని, మిగిలిన పంటలకు 15వ తేదీ లోపు చెల్లించాలని తెలిపారు. కార్యక్రమంలో ఏవో ఈశ్వర రెడ్డి పాల్గొన్నారు.

Similar News

News September 13, 2025

మైదుకూరు: తల్లీబిడ్డ మిస్సింగ్

image

మైదుకూరుకు చెందిన ముత్తరాయపల్లెలో నివసించే మేకల సుమతి (22) తన రెండేళ్ల కుమారుడు చందుతో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయింది. దీనిపై భర్త చెండ్రాయుడు, ఆమె తల్లి మైదుకూరు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. సుమతి ఆచూకీ తెలిసినవారు మైదుకూరు సీఐ (9121100618), ఎస్సై(9121100619)కు సమాచారం ఇవ్వాలని కోరారు.

News September 12, 2025

కడప: RI వీరేశంను సన్మానించిన ఎస్పీ

image

కడప జిల్లా పోలీసు శాఖకు RI వీరేశ్ ఎంతగానో సేవలు అందించాలని జిల్లా SP అశోక్ కుమార్ ప్రశంసించారు. శుక్రవారం బదిలీపై చిత్తూరుకు వెళ్తున్న ఆర్ఐ వీరేశ్‌కు ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఉన్నతాధికారుల ఆదేశాలను పాటిస్తూ అప్పగించిన విధులను సమర్ధవంతంగా నిర్వర్తించారన్నారు. వీఐపీల రాక సందర్భంలో ఆర్‌ఐ వీరేశ్ అంకితభావంతో విధులు నిర్వర్తించారన్నారు.

News September 12, 2025

భూ సమస్యలపై త్వరిత పరిష్కారం: ఆదితిసింగ్

image

కడప కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (PGRS) సమావేశంలో జిల్లా ఇన్‌ఛార్జ్ కలెక్టర్, జేసీ ఆదితిసింగ్ అధికారులకు కీలక సూచనలు చేశారు. భూ సంబంధిత ఫిర్యాదులకు బాధ్యతాయుతంగా స్పందించి, వచ్చే నెలలోపు పెండింగ్ ఫిర్యాదులను “సున్నా” స్థాయికి తగ్గించాలని ఆదేశించారు. సెక్షన్ 22-ఏ డెలిషన్, అసైన్డ్ భూముల పరిష్కారంలో క్షేత్రస్థాయి విచారణ తప్పనిసరని పేర్కొన్నారు.