News March 22, 2025
కడప: ఈ-కేవైసీ చేస్తేనే రేషన్ సరుకులు

ఈనెల 31వ తేదీ లోపు రేషన్ కార్డులు ఈకేవైసీ చేయించుకోవాలని జిల్లా పౌర సరఫరాల అధికారి జె.శిరీష తెలిపారు. జిల్లా వ్యాప్తంగా రేషన్ కార్డుల్లో పెండింగ్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ తప్పనిసరిగా ఈ నెల 31వ తేదీ నాటికి ఈకేవైసీ చేయించుకోవాలని సూచించారు. ఈ కేవైసీ చేయించుకున్న వారికి మాత్రమే ఏప్రిల్ నెల నిత్యావసర సరుకులు అందుతాయని తెలిపారు. సమీపంలోని చౌక దుకాణం /సచివాలయంలో వెళ్లి ఈకేవైసీ చేయించుకోవాలన్నారు.
Similar News
News March 23, 2025
కడప జడ్పీ ఛైర్మన్.. వైసీపీకే ఖాయం

కడప జిల్లా పరిషత్ ఛైర్మన్ మరోసారి YCPకి వచ్చే అవకాశం ఉంది. ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి రాజీనామాతో ఖాళీ కాగా, నేడు ఇందుకు సంబంధించి నోటిఫికేషన్ రానుంది. జిల్లాలో 50 మంది జడ్పీటీసీలు ఉండగా, గత ఎన్నికల్లో YCP 49, TDP ఒక్కస్థానం గెలిచింది. ఇందులో ఒకరు చనిపోగా, TDPలోకి ఐదుగురు వెళ్లారు. అయినా YCP 42 స్థానాలతో ఆత్మవిశ్వాసంతో ఉంది. YCP నుంచి బి.మఠంకు చెందిన రామగోవిందురెడ్డి ఛైర్మన్కు ముందు వరుసలో ఉన్నారు.
News March 23, 2025
YVU: ‘ఆర్కిటెక్చర్ యూనివర్సిటీ నిర్మాణానికి అనుమతి ఇవ్వాలి’

వైవీయూ వీసీ అల్లం శ్రీనివాసరావుని YSR ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య జి.విశ్వనాధ కుమార్, కులసచివులు ఎన్. రాజేశ్ కుమార్ రెడ్డి కడప సీపీ బ్రౌన్లో శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. వారికి పుష్పగుచ్చం అందజేశారు. యోగి వేమన యూనివర్సిటీ కంట్రోల్లో ఉన్న గురుకుల భవనాలలో ఆర్కిటెక్చర్ యూనివర్సిటీని నిర్వహించుకొనుటకు అనుమతించవలసినదిగా కోరామన్నారు.
News March 22, 2025
కడప: కేజీబీవీలో ప్రవేశాలకు దరఖాస్తులు

కడప జిల్లాలోని 17 మండలాల్లోని కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయాల్లో అర్హులైన విద్యార్థుల ప్రవేశాలకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు జిల్లా సమగ్ర శిక్షా అకాడమిక్ మానిటరింగ్ అధికారి వీరేంద్ర తెలిపారు. జిల్లా సమగ్ర శిక్షా ప్రాజెక్టు అధికారి నిత్యానందరాజు ఆదేశాల మేరకు కేజీబీవీలలో 6 నుంచి ఇంటర్ వరకు చదివేందుకు అర్హులైన బాలికలు నేటి నుంచి ఏప్రిల్ 12లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.