News November 16, 2024
కడప ఉరుసు మహోత్సవాలకు రానున్న ప్రముఖులు

కడప నగరంలోని పెద్ద దర్గా ఉరుసు మహోత్సవాలు నేటి నుంచి అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఈ ఏడాది జరగబోయే ఉరుసు మహోత్సవాలకి ప్రముఖ నటుడు ‘రామ్ చరణ్, సంగీత మాంత్రికుడు ఏఆర్ రెహమాన్’ రానున్నారు. కాగా బుధవారం రోజు ప్రముఖ గాయకుడు మనో (నాగూర్ బాబు) దర్గాను దర్శించారు. నేడు జరగబోయే గంధ మహోత్సవంలో AR రెహమాన్, 18వ తేదీ ముషాయిరా కార్యక్రమానికి రామ్ చరణ్ వస్తున్నట్లు సమాచారం.
Similar News
News November 7, 2025
సిద్ధవటం: అప్పుల బాధతో కౌలు రైతు ఆత్మహత్య

అప్పుల బాధతో కౌలు రైతు వెంకట నరసారెడ్డి(60) ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు, కుటుంబ సభ్యుల వివరాల మేరకు.. ఒంటిమిట్ట మండలం తప్పెటవారిపల్లికి చెందిన వెంకటనరసారెడ్డికి పంటలు చేతికి అందక రూ.40 లక్షల అప్పులయ్యాయి. ఆ బాధతో పురుగు మందు తాగి APSP 11వ బెటాలియన్ వెనుకవైపు ఉన్న పొలాల్లో ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య కుమారి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
News November 7, 2025
తొండూరు: పొలాల్లోనే కుళ్లిపోతున్న ఉల్లి గడ్డలు

తుఫాన్ వల్ల ఉల్లి పంట చేతికి అందకుండా పోతుందని జిల్లాలోని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తొండూరు మండలంలో వందల ఎకరాల్లో ఉల్లిగడ్డలు కుళ్లిపోతున్నాయి. ఇనగలూరు గ్రామానికి చెందిన గుజ్జుల గంగయ్య ఉల్లి పంట పీకి గట్లపై గడ్డలు ఆరబెట్టగా, మరి కొంతమంది ఉల్లి గడ్డలు అమ్మేందుకు కలాల్లో ఆరబోశారు. కీలక దశలో రైతు పాలిట వర్షాలు ఆశనిపాతంలా మారాయ్నారు. నష్టపోయిన ఉల్లి రైతును ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.
News November 7, 2025
వందేమాతరం గొప్ప గేయం: కడప SP

వందేమాతరం గేయాన్ని రచించి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కడప జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఎస్పీ నచికేత్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది సామూహికంగా వందేమాతరం గేయాన్ని ఆలపించారు. ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజల్లో దేశభక్తిని పెంపొందించే గొప్ప గేయం వందేమాతరం అని కొనియాడారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ప్రకాష్ బాబు తదితరులు పాల్గొన్నారు.


