News June 6, 2024
కడప: ఐటీఐలో ప్రవేశాలకు జూన్ 10 తుది గడువు

కడప జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐ కాలేజ్ల్లో ప్రవేశానికి జూన్ 10వ తేదీ తుది గడువని కడప ప్రభుత్వ మైనార్టీ ఐటీఐ ప్రిన్సిపల్, కన్వీనర్ ఎం.జ్ఞాన కుమార్ తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు తమ వివరాలను iti.ap.gov.in వెబ్ సైట్ ద్వారా నమోదు చేసుకోవాలని సూచించారు. 10వ తరగతి పాస్/ ఫెయిల్ అయిన అభ్యర్థులు ప్రవేశాలకు అర్హులన్నారు. అభ్యర్థులు తమకు సమీపంలో ఉన్న ఐటీఐల వద్ద రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చన్నారు.
Similar News
News February 22, 2026
ఎర్రగుంట్ల: రాత్రి రైలు ఎక్కి.. ఉదయానికి మిస్సింగ్

మచిలీపట్నం నుంచి ధర్మవరం వెళ్తున్న ఎక్స్ప్రెస్ రైలులో శనివారం ఉదయం ముక్కా ధనలక్ష్మి (25) అదృశ్యమైంది. ఈ మహిళ నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం గురువిమానిపల్లెకి చెందిన జగదీశ్వర్రెడ్డి భార్య. ఇరువురు విజయవాడలో శుక్రవారం రాత్రి రిజర్వేషన్ బోగీలో ఎక్కారు. తెల్లవారేసరికి తన భార్యలేదని భర్త ఎర్రగుంట్ల రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
News February 21, 2026
కడప జిల్లాలో ఆ కుటుంబం శకం ముగియనుందా?

బద్వేల్లో 60 ఏళ్లుగా బిజి వేముల వీరారెడ్డి కుటుంబం పాలకవర్గం లేదా ప్రతిపక్షంలో ఉంటూ వస్తోంది. అయితే బద్వేల్ రిజర్వ్డ్లోకి వెళ్లడంతో వారు సపోర్ట్ చేసిన వ్యక్తి ఓడిపోతూ వస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఇన్ఛార్జ్గా ఉన్న రితేశ్ రెడ్డిని తప్పించి DCCB ఛైర్మన్ సూర్యనారాయణ రెడ్డికి ఇన్ఛార్జ్ పగ్గాలు అప్పగిస్తారని ప్రచారం సాగుతోంది. ఇదే జరిగితే 60 ఏళ్ల తర్వాత ఆ కుటుంబం కథ ముగుస్తుందనే చెప్పవచ్చు.
News February 21, 2026
పుష్పగిరి ఆలయంలో అద్భుత శిల్పాలు

వల్లూరు మండలంలోని పుష్పగిరి శ్రీలక్ష్మీ చెన్నకేశవ, శ్రీవైద్యనాథ ఆలయాల్లోని కుడ్యశిల్పాలు విశేషంగా ఉన్నాయని చరిత్రకారుడు రమేష్ తెలిపారు. ఒకే ఇతివృత్తంతో, భిన్న భంగిమల్లో శివుని ఊర్ధ్వ, చతుర తాండవాలు, పార్వతీదేవి కూర్చున్న, నిలుచున్న రూపాలు చెక్కారు. ఒకే శిల్పంలో వృషభం, నందికేశ్వరుడు వేర్వేరుగా ఉండటం ఆనాటి శిల్పుల అద్భుత నైపుణ్యానికి సజీవ సాక్ష్యం.


