News January 21, 2025

కడప కోటిరెడ్డి కాలేజీ అమ్మాయికి అరుదైన గౌరవం

image

ఈనెల 26వ తేదీ దేశ రాజధాని న్యూఢిల్లీలో నిర్వహించనున్న గణతంత్ర దినోత్సవ వేడుకలకు కడపకు చెందిన ఎన్సీసీ క్యాడెట్ ఎస్.సుమియా ఎంపికైంది. కడప కోటిరెడ్డి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో బీకాం సెకండ్ ఇయర్ చదువుతున్న ఈమె బెటాలియన్ స్థాయి, తిరుపతి గ్రూప్ స్థాయిలతో పాటు ప్రీ రిపబ్లిక్‌డే వేడుకల్లో చక్కటి ప్రదర్శన కనబరిచింది. దీంతో ఢిల్లీలో నిర్వహించే పరేడ్ వేడుకల్లో పాల్గొనే అవకాశం ఈమెకు లభించింది.

Similar News

News November 5, 2025

ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్: ఎస్పీ

image

ప్రొద్దుటూరులో ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న 6 మంది సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆన్‌లైన్ యాప్‌ల ద్వారా బెట్టింగ్ నిర్వహిస్తూ, పదుల సంఖ్యలో ఫేక్ కరెంట్ బ్యాంక్ అకౌంట్లు తెరిచి ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నట్టు ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ తెలిపారు. ఈ ముఠా నుంచి రూ.6.28 లక్షల నగదు, ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

News November 5, 2025

ప్రొద్దుటూరు: 8 మంది క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకులపై కేసు నమోదు

image

ప్రొద్దుటూరు పోలీసులు బెట్టింగ్ మాఫియాపై ఉక్కు పాదం మోపుతున్నారు. తన బ్యాంక్ అకౌంట్లను బెట్టింగ్‌లకు ఉపయోగించారని జగన్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో 8 మందిపై కేసు నమోదు చేశారు. ఇందులో ప్రొద్దుటూరుకు చెందిన వీర శంకర్, చెన్న కృష్ణ, నరేంద్ర, మేరువ హరి, సుధీర్ కుమార్ రెడ్డి, కృష్ణా రెడ్డి, రవితేజ, పోరుమామిళ్ళ (M) నాయునిపల్లెకు చెందిన చంద్ర ఉన్నారు. ఈ కేసును 2 టౌన్ CI సదాశివయ్య దర్యాప్తు చేస్తున్నారు.

News November 4, 2025

రేపు కడపకు రానున్న AR రెహమాన్

image

ప్రముఖ సంగీత దర్శకుడు AR రెహమాన్ రేపు కడపకు రానున్నారు. కడప నగరంలో ప్రాచీనమైన అమీన్ పీర్ పెద్ద దర్గా ఉరుసు ఉత్సవాలలో భాగంగా నిర్వహించే గంధం వేడుకకు ఆయన హాజరుకానున్నారు. దర్గాలో జరిగే ఉరుసు ఉత్సవాలకు ప్రతి ఏడాది ఆనవాయితీగా ఆయన వస్తుంటారు. రేపు రాత్రి దర్గాలో జరిగే గంధ మహోత్సవం వేడుకలకు పీఠాధిపతితో కలిసి ఆయన దర్గాలో ప్రార్థనలు చేయనున్నారు.