News August 6, 2024

కడప: గణితశాస్త్రంలో మల్లీశ్వరికి వైవీయూ డాక్టరేట్

image

గణిత శాస్త్ర శాఖ స్కాలర్ అందెల మల్లీశ్వరికి వైవీయూ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. ఆ శాఖ సహ ఆచార్యులు డా. బి.శ్రీనివాస రెడ్డి పర్యవేక్షణలో “హీట్ ట్రాన్సఫర్ క్యారెక్టర్ స్టిక్స్ ఆఫ్ నానోప్లూయిడ్స్ ఇన్ డిఫరెంట్ కాన్ఫిగరేషన్స్”పై ఈమె పరిశోధన చేసి సిద్దాంత గ్రంథాన్ని వైవీయూకు సమర్పించారు. ఈ మేరకు మల్లీశ్వరికి డాక్టరేట్‌ను కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొ ఎన్. ఈశ్వర్ రెడ్డి ప్రకటించారు.

Similar News

News May 8, 2025

పెండ్లిమర్రిలో రోడ్డు ప్రమాదం.. మృతులు వీరే

image

పెండ్లిమర్రి మండలంలోని కొత్తూరు వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందిన విషయం తెలిసిందే. మృతులను వేంపల్లి శ్రీరాంనగర్‌కు చెందిన బాలయ్య, రాజీవ్ నగర్‌కు చెందిన మల్లికార్జున, మదనపల్లెకి చెందిన మల్లికార్జునగా స్థానికులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News May 8, 2025

పెండ్లిమర్రిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి

image

పెండ్లిమర్రి మండలం కొత్తూరు వద్ద గురువారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు. బైక్‌ను కంటైనర్ ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన మరొకరు వేంపల్లి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News May 8, 2025

కడప: రిమ్స్ ప్రిన్సిపల్‌గా డాక్టర్ జమున

image

కడప రిమ్స్ మెడికల్ కళాశాల నూతన ప్రిన్సిపల్‌గా డాక్టర్ జమున గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఉదయం కళాశాల సిబ్బంది ఆమెకు ఘనంగా స్వాగతం పలికి బొకేలు అందజేశారు. రిమ్స్ మెడికల్ కళాశాల అభివృద్ధికి కృషి చేస్తానని ఆమె అన్నారు. రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకుంటానని పేర్కొన్నారు.