News March 24, 2024

కడప: గొర్రెల మందపైకి దూసుకెళ్లిన లారీ

image

దువ్వూరు మండలంలోని ఇడమడక మెట్ట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కొత్తపల్లి బాల పెద్దన్నకు చెందిన 20 గొర్రెలు మృతిచెందాయి. గొర్రెల మంద రోడ్డు దాటుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఢీకొట్టిన లారీ నిలుపకుండా పోవడంతో పోలీసులకు పిర్యాదు చేశారు. చాగలమర్రి టోల్ ప్లాజా వద్ద గుర్తింపుకు పోలీసులు చర్యలు ప్రారంభించారు. దువ్వూరు ఎస్ఐ శ్రీనివాసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News April 10, 2025

ఒంటిమిట్ట కల్యాణోత్సవానికి బస్సు సర్వీసులు

image

ఒంటిమిట్టలో జరగనున్న కోదండ రామస్వామి కల్యాణోత్సవం సందర్భంగా 11వతేదీ 145 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశామని ఆర్టీసీ కడప రీజనల్ మేనేజర్ గోపాల్ రెడ్డి తెలిపారు. కడప డిపో నుంచి 35, పులివెందుల 12, బద్వేలు 22, జమ్మలమడుగు 12, మైదుకూరు 7, ప్రొద్దుటూరు 17తో పాటు ఇతర డిపోలు (రాయచోటి, రాజంపేట) నుంచి మరో 40 బస్సులు ఒంటిమిట్టలో కల్యాణోత్సవం జరిగే ప్రాంతం వరకు చేరుకుంటాయన్నారు.

News April 10, 2025

జమ్మలమడుగు: అది ప్రమాదం కాదు.. హత్యే.!

image

జమ్మలమడుగు-ముద్దనూరు రోడ్డులో మార్చి 24న ప్రమాదంలో గుడెంచెరువుకు చెందిన కిశోర్ బాబు మృతిచెందాడు. ఈ యాక్సిడెంట్‌ను పక్కా ప్లాన్‌తో ఉదయ్ కుమార్ చేశాడని CI లింగప్ప బుధవారం తెలిపారు. మార్చి 20న కిశోర్ బాబు మేనమామ కిరణ్ తల్లి దినం కార్యక్రమంలో ఉదయ్ కుమార్ భార్యను కిశోర్ కొట్టాడని వాగ్వాదానికి దిగాడు. దీంతో అతడిని ఎలాగైనా చంపాలని పక్కాప్లాన్‌తో యాక్సిడెంట్ చేశాడని CI తెలిపారు.

News April 9, 2025

ఒంటిమిట్ట కళ్యాణ వేడుక ఏర్పాట్ల పరిశీలన

image

11వ తేదీన జరగబోయే ఒంటిమిట్ట శ్రీ కోదండ రాముని కళ్యాణం వేడుకకు సంబంధించి పటిష్టమైన ఏర్పాటు చేసిన జిల్లా కలెక్టర్ శ్రీధర్ తెలిపారు. ఈ మేరకు ఒంటిమిట్ట కళ్యాణ వేదిక ప్రాంగణాన్ని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్‌తో కలిసి పరిశీలించారు. లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులు సిబ్బందికి కలెక్టర్ సూచించారు.

error: Content is protected !!