News March 24, 2024
కడప జిల్లాలలో నంద్యాల వాసి బలవన్మరణం
నంద్యాలకు చెందిన రాజశేఖర్ శర్మ అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడు కడప జిల్లాలో రెండు చేతులు బ్లేడుతో కోసుకుని శనివారం బలవన్మరణానికి పాల్పడ్డారు. ఇతను గోనెగండ్లలో పని చేసేవారు. ఇటీవల ఆయనను ఉద్యోగం నుంచి తొలగించారు. మనస్తాపానికి గురైన ఆయన ఇంటికి వెళ్లకుండా ప్రొద్దుటూరుకు వచ్చారు. ఓ లాడ్జిలో అద్దెకు దిగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఘటనాస్థలంలో సూసైడ్ నోట్ ను గుర్తించిన పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
Similar News
News February 6, 2025
విద్యావ్యవస్థ బలోపేతానికి ప్రతిపాదనలు పంపండి: కలెక్టర్
పాఠశాల విద్యావ్యవస్థ బలోపేతానికి ప్రతిపాదనలను పంపాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా అధికారులను కోరారు. బుధవారం పాఠశాలల బలోపేతం- రీస్ట్రక్చరింగ్ అంశంపై కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో వలసకు వెళ్లే విద్యార్థులు చదువుకు దూరం కాకూడదని అన్నారు. పాఠశాలలు అందుబాటులో ఉండేలా ప్రతిపాదనలు ఉండాలని మండల విద్యాశాఖ అధికారులను ఆదేశించారు.
News February 5, 2025
కర్నూలు APSP బెటాలియన్ కమాండెంట్గా దీపిక బాధ్యతల స్వీకరణ
కర్నూలు ఏపీఎస్పీ 2వ బెటాలియన్ కమాండెంట్గా దీపిక పాటిల్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. పోలీసుల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తానని వెల్లడించారు. ముందుగా బెటాలియన్ అధికారుల నుంచి ఆమె గౌరవ వందనం స్వీకరించారు. అడిషనల్ కమాండెంట్ మెహబూబ్ బాషా, తదితరులు పాల్గొన్నారు.
News February 5, 2025
కుటుంబానికి 100 రోజులు పని కల్పించాలి: కలెక్టర్
ఉపాధి హామీ పథకం ద్వారా ప్రతి రోజూ లక్ష మందికి ఉపాధి పనులు కల్పించాలని ఏపీడీ, ఎంపీడీవో, ఏపీవోలను కలెక్టర్ రంజిత్ బాషా ఆదేశించారు.ఉపాధి హామీ పనుల పురోగతి అంశంపై ఏపీడీలు, ఎంపీడీవోలు, ఏపీవోలతో కలెక్టర్ టెలికాన్ఫరెన్స్ ద్వారా బుధవారం సమీక్ష నిర్వహించారు. పనుల కల్పనలో వెనుకబడిన అధికారులతో మాట్లాడారు. కుటుంబానికి 100 రోజుల పని కల్పించాలన్నారు.