News March 3, 2026
కడప జిల్లాలోని AMCల్లో ఉద్యోగుల ఖాళీలు ఎన్నంటే.!

కడప జిల్లాలోని వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో <<19285111>>110 మంది<<>> దాకా ఉద్యోగుల కొరత ఉంది. కడపలో 41 మందికి గాను 9 మంది, ప్రొద్దుటూరులో 25 మందికి గాను 6, బద్వేల్లో 15 మందికి గాను 4, జమ్మలమడుగులో 10 మందికి గాను 4, రాజంపేటలో 8 మందికి గాను ముగ్గురు, మైదుకూరులో 12 మందికి గాను నలుగురు, కమలాపురంలో 8 మందికి గాను ఇద్దరు, ఎర్రగుంట్లలో 8 మందికి గాను ఇద్దరు, సింహాద్రిపురంలో 6 మందికి గాను ఇద్దరు మాత్రమే ఉద్యోగులు ఉన్నారు.
Similar News
News March 4, 2026
ప్రొద్దుటూరు: జగన్ పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన ASP

మాజీ సీఎం YS జగన్ ఈనెల 5న ప్రొద్దుటూరుకు రానున్న విషయం తెలిసిందే. ప్రొటోకాల్ ప్రకారం YS జగన్ పర్యటన బందోబస్తు, హెలిప్యాడ్ ఏర్పాట్లను మంగళవారం ప్రొద్దుటూరు ASP విభుకృష్ణ పరిశీలించారు. 1-టౌన్ సీఐ కొండారెడ్డి, రూరల్ సీఐ నాగభూషణ్తో కలిసి ASP తనిఖీ చేశారు. నిర్వాహకులకు తగిన సూచనలు చేశారు. ప్రొద్దుటూరు మాజీ MLA రాచమల్లు కుమార్తె వివాహ రిసెప్షన్కు ప్రొద్దుటూరుకు YS జగన్ వస్తున్నారు.
News March 3, 2026
కడప జిల్లా పురపాలక పాలకవర్గాలకు కౌంట్ డౌన్.!

కడప: జిల్లాలో పురపాలక పాలకవర్గాలకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. వీటి పదవీకాలం ఈనెల 17 నాటికి ముగియనుంది. 18వ తేదీ నుంచి ప్రత్యేక అధికారుల పాలన ప్రారంభం కానుంది. జిల్లాలో కడప కార్పొరేషన్, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, మైదుకూరు మున్సిపాలిటీలతో పాటు జిల్లాలోని మిగతా మున్సిపాలిటీల పాలకవర్గాల పదవీకాలం రెండు వారాల్లో ముగియనుంది. గత ఎన్నికల్లో వీటి అన్నింటినీ వైసీపీ గెలుచుకుంది.
News March 3, 2026
కడప: ఆదాయం గణం.. సిబ్బంది శూన్యం.!

కడప జిల్లాలో వ్యవసాయ మార్కెట్ కమిటీల తీరు ఆదాయం ఘనం.. సిబ్బంది శూన్యం అన్నట్లుగా ఉంది. జిల్లాలో 11 AMCలు ఉన్నాయి. వీటి వార్షిక ఆదాయ లక్ష్యం రూ.14.27 కోట్లు కాగా.. ఇప్పటి వరకు <<19281818>>రూ.11.78 కోట్లు<<>> వసూలు చేశాయి. అయితే జిల్లాలోని ఏ AMCలో కూడా పూర్తిస్థాయిలో ఉద్యోగులు లేరు. సింహాద్రిపురం, ఎర్రగుంట్ల, సిద్దవటం, రాజంపేటలో రెగ్యులర్ సెక్రటరీలు సైతం లేరు. 150 గాను 40 మంది మాత్రమే ఉద్యోగులు ఉన్నారు.


