News April 13, 2025
కడప జిల్లాలో గత ఐదేళ్ల ఇంటర్ ఫలితాలు ఇవే..

☛ 2021 అకడమిక్ ఇయర్లో కరోనా కారణంగా 100 శాతం విద్యార్థుల ఉత్తీర్ణత
☛ 2022లో ఇంటర్ ఫస్టియర్ 41 శాతం.. సెకండియర్ 50 శాతం ఉత్తీర్ణత
☛ 2023లో ఫస్టియర్ 46 శాతం, సెకండియర్ 60 శాతం ఉత్తీర్ణత
☛ 2024లో ఫస్టియర్ 55 శాతం, సెకండియర్ 69 శాతం ఉత్తీర్ణత
☛ 2025లో ఫస్టియర్ 61 శాతం, సెకండియర్ 75 శాతం ఉత్తీర్ణత
కరోనా సమయంలో తప్ప ప్రతి ఏడాది కడప జిల్లా ఇంటర్ విద్యార్థుల ఉత్తీర్ణత శాతం పెరుగుతూ పోతోంది.
Similar News
News April 14, 2025
ఒంటిమిట్టలో 41.4 °c ఉష్ణోగ్రత నమోదు..

కడప జిల్లా ఒంటిమిట్టలో ఆదివారం అత్యధికంగా 41.6°c డిగ్రీల అధిక ఉష్ణోగ్రత నమోదు అయినట్లు ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా అత్యధికంగా నమోదైన ఎండ శాతం వివరాలను ప్రకటించగా ఇందులో కడప జిల్లాలో ఒంటిమిట్టలో అత్యధికంగా ఉష్ణోగ్రత నమోదైనట్లు అందులో పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వేసవి కాలం దృష్ట్యా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
News April 14, 2025
కడప: పీజీఆర్ఎస్ కార్యక్రమం రద్దు

కడప జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం సోమవారం రద్దు చేసినట్లు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. అంబేడ్కర్ జయంతి కావడంతో రాష్ట్ర ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించడంతో రద్దు చేసినట్లు తెలిపారు. జిల్లాలోని ప్రజలు ఈ విషయాన్ని గమనించి, ఎవరూ రావద్దు అని సూచించారు.
News April 13, 2025
కాళీయమర్దనాలంకారంలో శ్రీకోదండరామస్వామి కటాక్షం

ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 8వ రోజైన ఆదివారం ఉదయం కాళీయమర్దనాలంకారంలో స్వామివారు భక్తులను కటాక్షించారు. భజన బృందాలు భజనలు, కోలాటాలు ఆడుతుండగా స్వామివారు పురవీధుల్లో విహరించారు. వాహనసేవ ఉదయం 11 గంటలకు స్నపన తిరుమంజనం వేడుకగా ప్రారంభమైంది. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనంతోశ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరాములవారి ఉత్సవమూర్తులకు విశేషంగా అభిషేకం చేశారు.