News August 24, 2024
కడప జిల్లాలో తగ్గుతున్న పులుల సంఖ్య.!

ఉమ్మడి కడప జిల్లాలో ఈ ఏడాది పులుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. నాగార్జునసాగర్-శ్రీశైలం టైగర్ రిజర్వ్ అటవీ ప్రాంతంలో YSR జిల్లా వ్యాప్తంగా, రాయచోటి రేంజిలోని అటవీ ప్రాంతాల్లో సాంకేతిక డిజిటల్ కెమెరాల ద్వారా గణన చేపట్టారు. ఉమ్మడి కడప జిల్లాలో గతేడాది 5 పులులుండగా ప్రస్తుతం 3 మాత్రమే ఉన్నట్లు తేల్చారు. కారణం ఆవాసాలు అనుకూలంగా లేకపోవడంతో అవి ఇతర ప్రాంతంలోకి వెళ్లినట్లుగా అధికారులు వెల్లడించారు.
Similar News
News March 1, 2026
వల్లూరు: చంద్రగ్రహణం సందర్భంగా పుష్పగిరి ఆలయం మూసివేత

వల్లూరు (M) పుష్పగిరి లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయం చంద్రగ్రహణం సందర్భంగా ఈ నెల మూడో తేదీన ఉదయం 6 గంటల నుంచి నాలుగో తేదీ ఉదయం ఏడున్నర వరకు తలుపులు మూసివేసి ఉంటుందని దేవాలయ ఈవో శ్రీనివాసులు ఆదివారం తెలిపారు. చంద్రగ్రహణం అనంతరం ఆలయ శుద్ధి, పుణ్యహ వచనం స్వామివారికి విశేష అభిషేకం అనంతరం భక్తులకు స్వామివారి దర్శనం ఉంటుందని తెలిపారు. ఈ విషయాన్ని భక్తులు గమనించాలన్నారు.
News March 1, 2026
పుష్పగిరి నదిలో ఇద్దరు యువకులు గల్లంతు

వల్లూరు మండలం పుష్పగిరి నదిలో ఆదివారం ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. ముగ్గురు యువకులు డ్యాం చూడటానికి వచ్చి సరదాగా నదిలో దిగారు. ప్రమాదవశాత్తు ముగ్గురు నదిలో కొట్టుకుపోయారు. అందులో సురేంద్ర(25) అనే యువకుడు ప్రాణాలతో బయటపడ్డాడు. మిగిలిన ఇద్దరు శ్రీనాథ్, చైతన్యలు గల్లంతయ్యారు. శ్రీనాథ్ రైల్వే కొండాపురానికి చెందిన వ్యక్తిగా సురేంద్ర తెలిపారు. మృతదేహాల కోసం స్థానికులు గాలిస్తున్నారు.
News March 1, 2026
కడప జిల్లాలో ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.1,053 కోట్ల మద్యం అమ్మకాలు.!

కడప జిల్లాలో ఈ ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి నాటికి రూ.1,053 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. కడప రూ.288.12 కోట్లు, ప్రొద్దుటూరు రూ.185.50 కోట్లు, పులివెందుల రూ.126.07 కోట్లు, బద్వేల్ రూ.117.90 కోట్లు, మైదుకూరు రూ.101.80 కోట్లు, ఎర్రగుంట్ల రూ.80.91 కోట్లు, జమ్మలమడుగు రూ.77.01 కోట్లు, ముద్దనూరు రూ.42.97 కోట్లు, సిద్దవటం రూ.33.52 కోట్ల మద్యం విక్రయించారు.


