News March 21, 2024

కడప జిల్లాలో 8 మంది డీబార్

image

సార్వత్రిక పరీక్షలు అక్రమాలకు పాల్పడిన జమ్మలమడుగు జిల్లా పరిషత్ బాలిక పాఠశాల కేంద్రంలో 8 మంది విద్యార్థులను డీబార్ చేసినట్లు డీఈఓ అనురాధ తెలిపారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న చీఫ్ సూపరింటెండెంట్ డిపార్ట్మెంట్ అధికారులు తొలగించినట్లు చెప్పారు. కొత్తవారిని నియమించినట్లు తెలిపారు. బుధవారం జరిగిన పదో తరగతి ఆంగ్ల పరీక్షకు 2138 మందికి 1947 మంది హాజరయినట్లు తెలిపారు.

Similar News

News April 1, 2025

సీతారాముల కల్యాణానికి విస్తృత ఏర్పాట్లు

image

ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయంలో ఏప్రిల్ 11న జరిగే శ్రీ సీతారాముల కళ్యాణానికి ఎలాంటి లోటుపాట్లు లేకుండా పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ డా.శ్రీధర్ చెరుకూరి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఒంటిమిట్ట టీటీడీ పరిపాలన భవన సమావేశ మందిరంలో ఎస్పీ అశోక్ కుమార్, టీటీడీ జేఈవో వీరబ్రహ్మంతో కలిసి బ్రహ్మోత్సవాలపై సోమవారం సమీక్ష నిర్వహించారు. పలు అంశాలపై కలెక్టర్ సూచనలు చేశారు.

News March 31, 2025

అలా చేస్తే దక్షిణాదికి అన్యాయం: తులసి రెడ్డి

image

విజయవాడ బాలోత్సవ భవన్‌లో నియోజకవర్గాల పునర్విభజన అంశంపై సోమవారం రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఇందులో కడప జిల్లాకు చెందిన రాజ్యసభ మాజీ సభ్యుడు తులసి రెడ్డి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. జనాభా ప్రాతిపదికన పార్లమెంటు స్థానాలు కేటాయిస్తే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందన్నారు. దీనిని సరిదిద్దాలని కోరారు. సమావేశంలో సీపీఐ, సీపీఎం, జన చైతన్య వేదిక రాష్ట్ర నాయకులు తదితరులు పాల్గొన్నారు.

News March 31, 2025

రంజాన్ సందర్భంగా కడప జిల్లాలో భారీ బందోబస్త్

image

కడప జిల్లా వ్యాప్తంగా రంజాన్ పండుగ నేపథ్యంలో భారీ బందోబస్త్ ఏర్పాటు చేసినట్లు కడప జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. కడపలోని బిల్డప్ సర్కిల్ సమీపంలోనీ ఈద్గా వద్ద సోమవారం భద్రతను ఎస్పీ పరిశీలించారు. ఎక్కడా ఎటువంటి ఇబ్బందులూ లేకుండా తగిన భద్రతను నిర్వహించాలని సిబ్బందికి సూచించారు. జిల్లా వ్యాప్తంగా ఆన్ ఈద్గాల వద్ద ప్రజలకు తగిన ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు.

error: Content is protected !!