News March 21, 2024
కడప జిల్లాలో 8 మంది డీబార్

సార్వత్రిక పరీక్షలు అక్రమాలకు పాల్పడిన జమ్మలమడుగు జిల్లా పరిషత్ బాలిక పాఠశాల కేంద్రంలో 8 మంది విద్యార్థులను డీబార్ చేసినట్లు డీఈఓ అనురాధ తెలిపారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న చీఫ్ సూపరింటెండెంట్ డిపార్ట్మెంట్ అధికారులు తొలగించినట్లు చెప్పారు. కొత్తవారిని నియమించినట్లు తెలిపారు. బుధవారం జరిగిన పదో తరగతి ఆంగ్ల పరీక్షకు 2138 మందికి 1947 మంది హాజరయినట్లు తెలిపారు.
Similar News
News October 27, 2025
అత్యవసరమైతే 112కు ఫోన్ చేయండి: ఎస్పీ

తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో సహాయక చర్యలకు జిల్లా పోలీస్ శాఖ సిద్ధంగా ఉందని జిల్లా ఎస్పీ నచికేత్ ఆదివారం తెలిపారు. జిల్లా కేంద్రంలో మూడు రెస్క్యూ టీంలతోపాటు ప్రతి పోలీస్ సబ్ డివిజన్కు ఒక టీం సిద్ధంగా ఉందన్నారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. వాగులు, వంకలు దాటరాదని, ఎలాంటి సహాయక చర్యలు అవసరమైన వెంటనే 112కు ఫోన్ చేసి తెలిపితే, సహాయక చర్యలకు తమ శాఖ సిద్ధంగా ఉందన్నారు.
News October 26, 2025
జమ్మలమడుగులో భార్యాభర్తలు దారుణ హత్య

జమ్మలమడుగు- తాడిపత్రి రహదారిలో శ్రీకృష్ణ మందిరం సమీపంలో ఇటికల బట్టి వద్ద కాపలాగా ఉన్న నాగప్ప పెద్దక్క అనే దంపతులపై శనివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు మారణాయుధాలతో దాడి చేశారు. దాడులు చేయడంతో తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందారు. ఆ ఇంట్లో ఉన్న వస్తువులను చోరీ చేశారు. ఇది దొంగల పనేనని స్థానికులు అంటున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News October 26, 2025
కడప జిల్లా ప్రజలకు గమనిక

కడప జిల్లాలో వాతావరణ పరిస్థితి దృష్టిలో ఉంచుకొని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక రద్దు చేసినట్లు జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ ఆదితి సింగ్ ఆదివారం తెలిపారు. విషయాన్ని జిల్లా ప్రజలు గమనించాలని సూచించారు. జిల్లా ప్రజలు తమ ఫిర్యాదులు ఏమైనా ఉంటే వాటిని వెబ్సైట్లో నమోదు చేసుకోవాలని కోరారు. వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు.


