News December 31, 2025

కడప: ‘ధాన్యం అమ్మిన మూడు రోజుల్లో డబ్బులు జమ’

image

కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం విక్రయించిన రైతులకు 3 రోజుల్లో డబ్బులు జమ అవుతాయని సివిల్ సప్లై జిల్లా మేనేజర్ నాగసుధ పేర్కొన్నారు. దువ్వూరులోని కొనుగోలు కేంద్రాన్ని బుధవారం సివిల్ సప్లై జిల్లా మేనేజర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ.. ధాన్యం విక్రయించే రైతులకు గోనె సంచులు, హమాలీ ఖర్చులను ప్రభుత్వమే భరాయిస్తుందన్నారు. ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని సిబ్బందికి సూచించారు.

Similar News

News January 3, 2026

కడప: ‘10th పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించాలి’

image

కడప జిల్లా విద్యార్థులు పదో తరగతి పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించడానికి ప్రత్యేక అధికారులు, ప్రధానోపాధ్యాయులు తమ వంతు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ పిలుపునిచ్చారు. శుక్రవారం సభా భవన్‌లో 100 రోజుల యాక్షన్ ప్లాన్‌పై జిల్లా కలెక్టర్ శ్రీధర్, రాజంపేట సబ్ కలెక్టర్ భావన, డీఈఓ శంషుద్దీన్ కలసి ప్రత్యేక అధికారులు, హెడ్ మాస్టర్లతో సమావేశం నిర్వహించారు.

News January 3, 2026

కడప: ‘10th పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించాలి’

image

కడప జిల్లా విద్యార్థులు పదో తరగతి పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించడానికి ప్రత్యేక అధికారులు, ప్రధానోపాధ్యాయులు తమ వంతు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ పిలుపునిచ్చారు. శుక్రవారం సభా భవన్‌లో 100 రోజుల యాక్షన్ ప్లాన్‌పై జిల్లా కలెక్టర్ శ్రీధర్, రాజంపేట సబ్ కలెక్టర్ భావన, డీఈఓ శంషుద్దీన్ కలసి ప్రత్యేక అధికారులు, హెడ్ మాస్టర్లతో సమావేశం నిర్వహించారు.

News January 2, 2026

‘కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ పూర్తి చేయాలి’

image

కడప జిల్లాలో శతాబ్ద కాలం ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్న ఉక్కు పరిశ్రమను తక్షణమే పూర్తి చేయాలని వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక రాష్ట్ర అధ్యక్షుడు నారాయణ డిమాండ్ చేశారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక ఆధ్వర్యంలో జమ్మలమడుగు కన్యతీర్థం వద్ద ఉక్కు శంకుస్థాపన ప్రదేశాన్ని సందర్శించారు. కడప జిల్లా తీవ్రంగా వెనుకబడిన ప్రాంతమని, పరిశ్రమల లేమివల్ల యువతకు ఉపాధి ఉంటుందన్నారు.