News June 7, 2024
కడప: నలుగురికి హ్యాట్రిక్ మిస్
ఉమ్మడి కడప జిల్లాలో టీడీపీ జయకేతనం ఎగరేసింది. అయితే జిల్లాలో ఇప్పటికే రెండు సార్లు గెలిచిన నలుగురు అభ్యర్థులు హ్యాట్రిక్ మిస్ అయ్యారు. వారిలో
ఎస్.రఘరామిరెడ్డి, పి.రవీంద్రనాథరెడ్డి, అంజాద్ బాషా, రాచమల్లు శివప్రసాద్ రెడ్డిలు ఉన్నారు. కాగా శ్రీకాంత్ రెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలవగా, ఈసారి ఓటమి పాలయ్యారు. దీంతో దశాబ్దాల చరిత్ర కలిగిన నాయకులు ఓటమి రుచి చూశారు.
Similar News
News September 29, 2024
ముద్దనూరు వద్ద అదుపుతప్పి లారీ బోల్తా
కడప జిల్లా ముద్దనూరు మండలంలోని నల్లబల్లె రహదారిపై ఆదివారం తెళ్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. ముద్దనూరు నుంచి తాడిపత్రి బైపాస్ పనుల కొరకు కంకర లోడ్తో వెళ్తున్న ఓ టిప్పర్ ఉదయం 2.30 సమయంలో అదుపు తప్పి పంట పొలాల్లో బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డాడు. ఒకేసారి పదుల సంఖ్యలో టిప్పర్లు వెళ్తుండగా వెనక టిప్పర్కు దారిచ్చే ప్రయత్నంలో ప్రమాదం జరిగిందన్నారు.
News September 29, 2024
చక్రాయపేటలో ఆరేళ్ల బాలికపై అత్యాచార యత్నం
కడప జిల్లా చక్రాయపేట మండలంలో నెరుసుపల్లె గ్రామం అప్పిరెడ్డిగారిపల్లెలో శివాజీ అనే యువకుడు, శనివారం ఆరేళ్ల బాలికకు చాక్లెట్ ఆశ చూపి అత్యాచారయత్నానికి ఒడిగట్టినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు వైద్య పరీక్షల నిమిత్తం ఆ బాలికను కడప రిమ్స్కు తరలించినట్లు తెలిసింది. పోలీసులు అత్యాచార యత్నానికి పాల్పడిన యువకుడు శివాజీని అరెస్టు చేసి ఫోక్సో కేసు నమోదు చేసినట్లు సమాచారం.
News September 29, 2024
వేంపల్లి: యూట్యూబర్పై కేసు నమోదు
వేంపల్లెలో ఓ యూట్యూబ్ ఛానెల్ అధినేతపై కేసు నమోదు చేశారు. తన ఛానెల్లో పని చేస్తున్న యువతిని వేధించిన కేసులో సదరు వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు CI సురేష్ రెడ్డి తెలిపారు. ‘అతడి ఛానెల్లో యాంకర్గా పనిచేసే సమయంలో అసభ్యంగా ప్రవర్తించాడు. అక్కడ మానేసినా వేధింపులు అపలేదు. తాను అతడి మాటలు వినలేదని తన ఆఫీసు నుంచి నా సర్టిఫికేట్లు తీసుకెళ్లానని అబద్దపు కేసు పెట్టారు’ అని ఫిర్యాదులో తెలిపింది.