News March 2, 2026
కడప: నేటి ఇంటర్ పరీక్షలకు 96% విద్యార్థులు హాజరు.!

కడప జిల్లాలో సోమవారం 62 సెంటర్లలో ఇంటర్ 1st ఇయర్ మ్యాథమాటిక్స్ పేపర్-1 పరీక్షలకు 96% విద్యార్థులు హాజరయ్యారు. 10,926 మందికి గాను.. 10,463 మంది పరీక్షలు రాయగా, 463 మంది ఆబ్సెంట్ అయ్యారు. రెగ్యులర్ విద్యార్థుల్లో 9,588 మందికి గాను.. 9,284 మంది హాజరవ్వగా, 304 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్ విద్యార్థుల్లో 1,338 మందికి గాను.. 1,179 మంది పరీక్షలు రాశారు. 159 మంది విద్యార్థులు పరీక్షలు రాయలేదు.
Similar News
News March 6, 2026
కడప జిల్లాలో జీఎస్టీ రిజిస్ట్రేషన్ వ్యాపారులు ఎంతమందంటే.!

కడప జీఎస్టీ డివిజన్లో 8 సర్కిల్ కార్యాలయాలు ఉన్నాయి. వీటి పరిధిలో సుమారు 34,132 మంది జీఎస్టీ రిజిస్ట్రేషన్ వ్యాపారులు ఉన్నారు.
➤ కడప సర్కిల్-1లో 6031 మంది
➤ కడప సర్కిల్-2లో 4411
➤ ప్రొద్దుటూరు సర్కిల్-1లో 3450
➤ ప్రొద్దుటూరు సర్కిల్-2లో 4504
➤ పులివెందులో 2617
➤ రాయచోటిలో 5983
➤ మదనపల్లెలో 7032
➤ కడప స్పెషల్ సర్కిల్లో 99 జీఎస్టీ రిజిస్ట్రేషన్ దారులు ఉన్నారు.
News March 6, 2026
పులివెందుల సీఐగా శ్రీరామ్

గతంలో ప్రొద్దుటూరులో పనిచేసిన సీఐ శ్రీరామ్ను పులివెందుల సీఐగా బదిలీ చేస్తూ కర్నూల్ డీఐజీ కోయ ప్రవీణ్ ఉత్తర్వులు జారీ చేశారు. సీతారామిరెడ్డిని పులివెందుల టౌన్ నుంచి రూరల్కు, శాంతిలాల్ను కడప వీఆర్ నుంచి పులివెందుల ట్రాఫిక్కు బదిలీ చేశారు. శంకర్ రెడ్డిని కడప RSTF నుంచి RK వ్యాలీకి, ఉలసయ్యను RK వ్యాలీ నుంచి కడప వీఆర్కు, హాజీవల్లీని పులివెందుల ట్రాఫిక్ నుంచి నంద్యాల DPTCకి బదిలీ చేశారు.
News March 6, 2026
ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్పై విచారణ.!

ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ రవిచంద్రారెడ్డిపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ACB తనిఖీల్లో రవిచంద్రారెడ్డి నంద్యాల మున్సిపల్ కమిషనర్గా పనిచేసిన సమయంలో భవన నిర్మాణ అనుమతులు, అక్రమ భవనాలు క్రమబద్ధీకరణ, భవనాలకు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు జారీ చేయడంలో అవినీతికి పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలపై ప్రభుత్వం విచారణకు ఉత్తర్వులు జారీ చేసింది.


