News April 24, 2025
కడప: నోటిఫికేషన్ విడుదల

ఏపీలో టెన్త్ ఫలితాలు వెలువడడంతో రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (RGUKT- AP) పరిధిలోని ఒంగోలు, ఇడుపులపాయ ఐఐఐటీలో 2025-26 విద్యా సంవత్సరానికి ప్రవేశాల నోటిఫికేషన్ను ఆర్జీయూకేటీ అధికారులు విడుదల చేశారు. ఈనెల 27న ఉ. 10 గంటల నుంచి మే 20వ తేదీ సా. 5 గంటల వరకు దరఖాస్తు గడువు ఉంటుందన్నారు. అర్హులైన విద్యార్థులు యూనివర్సిటీ అధికారిక వెబ్సైట్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
Similar News
News April 24, 2025
అఖిలపక్ష భేటీకి అసదుద్దీన్ ఒవైసీకి ఆహ్వానం

పహల్గామ్లో ఉగ్రదాడి నేపథ్యంలో ఇవాళ కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తోంది. ఈ భేటీకి AIMIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీకి ఆహ్వానం అందింది. అమిత్ షా తనకు కాల్ చేసి సమావేశానికి రావాలని ఆహ్వానించినట్లు ఒవైసీ తెలిపారు. ఈ సందర్భంగా అందరి అభిప్రాయాలు వినేందుకు PM ఎక్కువ సమయం కేటాయించాలని కోరారు. ఇవాళ ఉదయం అఖిలపక్ష భేటీకి 5-10 MPలు ఉన్న చిన్న పార్టీలనూ పిలవాలని ఒవైసీ డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.
News April 24, 2025
90 శాతం సమస్యలు ఎమ్మార్వో వద్దనే పరిష్కారమవుతాయి: జనగామ కలెక్టర్

భూ భారతి చట్టంతో 90 శాతం వరకు సమస్యలు తహశీల్దార్ల వద్దనే పరిష్కారమవుతాయని జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ అన్నారు. బచ్చన్నపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో భూ భారతి ఆర్ఓఆర్ చట్టాలపై అవగాహన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ.. భూభారతి చట్టం ద్వారా రైతుల భూ సమస్యల పరిష్కారానికి మంచి అవకాశం ఉన్న దృశ్యా ఈ చట్టంపై జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని తెలిపారు.
News April 24, 2025
రైతులకు భూ భారతి భరోసా: WGL కలెక్టర్

పట్టేదారు రైతు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అధిగమించి వారికి భరోసా కల్పించేందుకు ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చిందని కలెక్టర్ సత్య శారద దేవి అన్నారు. గురువారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన భూ భారతి అవగాహన సదస్సులో చట్టంపై రైతులకు వివరించారు. రెవెన్యూ రికార్డులు ఏమన్నా లోటుపాట్లు ఉంటే భూభారతిలో సరిచేసుకునే అవకాశం ఉందన్నారు. దీనిపై అవగాహన పెంచుకొని రైతులందరూ వినియోగించుకోవాలన్నారు.