News September 22, 2024

కడప: న్యాయ వ్యవస్థపై ప్రజల్లో నమ్మకాన్ని పెంచాలి

image

అందరికి న్యాయం అందాలని, న్యాయ వ్యవస్థపై ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందించాలని హై కోర్ట్ జస్టిస్ రామకృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు. కడప పోలీస్ పెరేడ్‌లోని మీటింగ్ సమావేశంలో జిల్లా స్థాయి జుడీషియల్ అధికారుల వర్క్ షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ శివశంకర్, ఎస్పీ హర్షవర్ధన్ రాజు హాజరయ్యారు. అమలవుతున్న యాక్ట్స్‌పై న్యాయవాదులు నిబద్ధతతో చట్టాలను అమలు చేయాలని సూచించారు.

Similar News

News July 6, 2025

రైతులకు అవగాహన కల్పించండి: కడప కలెక్టర్

image

కడప జిల్లాలో ఈనెల 14వ తేదీ వరకు జరిగే పశుగ్రాస వారోత్సవాలను విజయవంతం చేయాలని కలెక్టర్ శ్రీధర్ ఆదేశించారు. పశుగ్రాస వారోత్సవాల గోడపత్రికలను ఆయన కడపలో ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. పశుగ్రాసాలను సాగు చేసి రైతుల ఇంట సిరుల పండించేలా చూడాలన్నారు. దీనిపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. పశుగ్రాసాల సాగు ఎంతో ఉపయోగకరమని ఆ దిశగా చర్యలు చేపట్టాలన్నారు.

News July 6, 2025

వేంపల్లి: ట్రాక్టర్ ఢీ.. 50 గొర్రెలు మృతి

image

కడప జిల్లా వేంపల్లి మండలం నందిపల్లి- తాళ్లపల్లి మధ్యలో ట్రాక్టర్ ఢీకొని 50 గారెలు మృతి చెందినట్లు సమాచారం. ఈ గొర్రెలు తాటిమాకులపల్లె ఎస్సీ కాలనీకి చెందిన వారివిగా గుర్తించారు. వీరంతా తాళ్లపల్లిలో మేపుకోసం వెళ్తున్నారు. అటుగా స్పీడుగా వచ్చిన ట్రాక్టర్ గొర్రెలను ఢీకొనగా అక్కడికక్కడే 50 గొర్రెలు మృతి చెందినట్లు సమాచారం. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News July 6, 2025

పోరుమామిళ్ల: నకిలీ కానిస్టేబుల్‌పై ఫిర్యాదు

image

పోరుమామిళ్ల మండలం కమ్మవారిపల్లెకి చెందిన ఓ యువతి సత్యసాయి జిల్లా తుమ్మలవారిపల్లెకి చెందిన భాను ప్రకాశ్‌ను 7 నెలల క్రితం వివాహం చేసుకుంది. అతను హైదరాబాదులో AR కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నట్లు నమ్మించి మోసం చేసి వివాహం చేసుకున్నాడని యువతి తెలిపింది. అంతేకాకుండా అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని శనివారం పోరుమామిళ్ల PS‌లో ఫిర్యాదు చేసింది.