News June 26, 2024
కడప: పకడ్బందీగా ప్రజలకు నిత్యావసరాల పంపిణీ: జేసీ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_62024/1719316789024-normal-WIFI.webp)
ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజలకు నిత్యావసర వస్తువులు పక్కాగా పంపిణీ చేయాలని జాయింట్ కలెక్టర్ ఫర్మన్ అహ్మద్ ఖాన్ సంబంధిత అధికారులకు సూచించారు. కలెక్టరేట్ నుంచి ఆర్డీవోలు, తహశీల్దార్లతో జాయింట్ కలెక్టర్ ఫర్మన్ అహ్మద్ ఖాన్, వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రజలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేయాలన్నారు.
Similar News
News June 29, 2024
రాయచోటి: నా ఇల్లు నాకు ఇప్పించండని మహిళ ఆవేదన
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_62024/1719588543604-normal-WIFI.webp)
అన్నమయ్య జిల్లా సుండుపల్లికి చెందిన వికలాంగురాలు షాహిదా ఇంటిని ఓ వ్యక్తి అద్దెకి తీసుకొని రిజిస్టర్ చేయించుకొని తనని బయటకు గెంటేశాడని బాధితురాలు వాపోయింది. ఈ విషయంపై బాధితురాలు చాలా రోజుల నుంచి రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగిన ఉపయోగం లేకపోవడంతో కలెక్టర్కు వినతి పత్రం అందజేసింది. జాయింట్ కలెక్టర్ ఫర్ మాన్ అహ్మద్ విచారించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
News June 29, 2024
బద్వేల్: ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేసిన జిల్లా ఎస్పీ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_62024/1719588154778-normal-WIFI.webp)
ఎర్రచందనం అక్రమ రవాణాలో సంబంధం ఉన్నటువంటి ఇద్దరు కానిస్టేబుళ్లను శుక్రవారం సాయంత్రం జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ సస్పెండ్ చేశారు. ఇటీవల పట్టుబడిన ఎర్ర చందనం కేసులో బద్వేలు అర్బన్ స్టేషన్ కానిస్టేబుల్ సుధాకర్, అట్లూరు స్టేషన్ కానిస్టేబుల్ రామకృష్ణ ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ క్రమంలో సస్పెండ్ చేస్తూ జిల్లా ఎస్పీ ఉత్తర్వులు జారీ చేశారు.
News June 29, 2024
ప్రొద్దుటూరు: ‘విద్యార్థులు జంక్ ఫుడ్కు దూరంగా ఉండాలి’
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_62024/1719584154524-normal-WIFI.webp)
విద్యార్థులు జంక్ ఫుడ్కు దూరంగా ఉండాలని డాక్టర్ అపర్ణ శ్రీరామ్, యునాని డాక్టర్ నిరంజన్ నాయక్ తెలిపారు. శుక్రవారం ప్రొద్దుటూరు హోమస్ పేటలోని మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో సీజనల్ వ్యాధులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులు భోజనానికి ముందు, తర్వాత చేతులు శుభ్రం చేసుకోవాలని డాక్టర్లు సూచించారు. 260 మంది విద్యార్థులకు వ్యాధి నిరోధక హోమియో మందులను ఇచ్చారు.