News June 6, 2024

కడప: ప్రజలు కసితో ఓటు వేశారు: మాజీ మంత్రి

image

ఐదేళ్ల అరాచకపాలనతో విసుగు చెందిన రాష్ర్ట ప్రజలంతా కసితో టీడీపీకి ఓటేశారని మాజీ మంత్రి, సి. రామచంద్రయ్య అన్నారు. కడపలో ఆయన మాట్లాడుతూ.. జగన్ ఓడిపోయి ప్రజలపై నిందలు వేయడం సరికాదన్నారు. జగన్ తీరుతో కడప జిల్లా ప్రజలు తలదించుకోవాల్సి వచ్చిందన్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు విచ్చలవిడిగా దోచుకున్నారని వారికి ప్రజలు సరైన గుణపాఠం చెప్పారన్నారు. వైసీపీ నేతలు ఇప్పటికైనా ప్రజలకు క్షమాపణలు చెప్పాలన్నారు.

Similar News

News November 10, 2025

కడప శ్రీ చైతన్యలో విద్యార్థిని ఆత్మహత్య

image

కడప శ్రీ చైతన్య బాలికల రెసిడెన్షియల్ స్కూల్లో తొమ్మిదో తరగతి బాలిక జస్వంతి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. విద్యార్థిని పులివెందుల వాసిగా సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News November 10, 2025

ఎర్రగుంట్లలోని ఆలయంలో హీరో సుమన్ సందడి

image

ఎర్రగుంట్ల (M) కలమల్ల గ్రామంలోని చెన్నకేశవ స్వామి ఆలయంలో సినీ హీరో సుమన్ సందడి చేశారు. అక్కడ ఉన్న పురాతన తొలి తెలుగు శాసనాన్ని పరిశీలించారు. తెలుగు శాసనాన్ని కట్టుదిట్టంగా ఏర్పాటు చేయడానికి తనవంతు కృషి చేస్తానన్నారు. ఆయన వెంట ఆలయాధికారులు, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.

News November 10, 2025

మైదుకూరు: ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

image

మైదుకూరు మండలం జీవి సత్రం హైవే రోడ్డ పైన గుర్తు తెలియని వాహనం ఢీకొని ఇద్దరు యువకులు మృతి చెందారు. ఇద్దరు యువకులు కడపకు చెందిన సంజయ్, సంతోశ్‌ అని స్థానికులు గుర్తించారు. మృత దేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.