News September 24, 2025

కడప: ప్లాన్ ప్రకారమే వడ్డీ వ్యాపారి హత్య?

image

కడప జిల్లాలో వడ్డీ వ్యాపారి హత్య సంచలనం రేకిత్తించిన విషయం తెలిసిందే. అయితే వ్యాపారి వేణుగోపాల్‌రెడ్డిని పక్కా ప్లాన్‌తో హత్య చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైనట్లు తెలుస్తోంది. ఆయన ఇంటి వద్ద పలుమార్లు రెక్కీ నిర్వహించి హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు. ఆయన నుంచి అప్పులు తీసుకున్న వారే హైదరాబాద్‌కు చెందిన కిరాయి హంతకులకు సుపారీ ఇచ్చి హత్య చేయించినట్లు పోలీసులు ఆధారాలు సేకరించినట్లు సమాచారం.

Similar News

News September 24, 2025

కడప మేయర్ సురేశ్ బాబుపై అనర్హత వేటు

image

కడప కార్పొరేషన్‌లో నిబంధనలకు విరుద్ధంగా మేయర్ సురేష్ బాబు కుటుంబ సభ్యులు కాంట్రాక్టు పనులు చేశారని MLA మాధవి రెడ్డి ఫిర్యాదు చేశారు. విజిలెన్స్ విచారణ తర్వాత మేయర్‌‌‌‌ పదవి నుంచి ఆయనను తప్పించారు. దీనిపై సురేశ్ బాబు కోర్టుకు వెళ్లగా మరోసారి ఆయన వాదనలు వినాలని సూచించింది. ఈనెల 17న మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శికి సురేశ్ బాబు తన వాదన వినిపించారు. సంతృప్తి చెందని అధికారి మేయర్‌పై అనర్హత వేటు వేశారు.

News September 23, 2025

కడప: ‘అక్టోబర్ 2 నాటికి స్మార్ట్ కిచెన్లు సిద్ధం చేయాలి’

image

జిల్లా వ్యాప్తంగా ఆయా మండలాలలో అక్టోబర్ రెండు నాటికి స్మార్ట్ కిచెన్లు అందుబాటులోకి రావాలని జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ అన్నారు. మంగళవారం JC అతిధి సింగ్‌తో కలిసి స్మార్ట్ కిచెన్ల భవన నిర్మాణాల పురోగతిపై సమీక్ష చేపట్టారు. స్మార్ట్ కిచెన్లు అన్ని మండలాల్లో ఓకే డిజైన్‌లో ఉండాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని మరింత నాణ్యతగా, రుచికరంగా అందించాలన్నారు.

News September 23, 2025

ఎస్పీని కలిసిన కడప జిల్లా రాజకీయ నేతలు

image

ఇటీవల కడప ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన నచికేత్ విశ్వనాథ్‌ను జిల్లా రాజకీయ నేతలు మర్యాదపూర్వకంగా ఒకరి తర్వాత ఒకరు కలిశారు. వారంతా జిల్లాలో శాంతిభద్రతలకు ఎవరైనా విఘాతాలు కలిగిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరారు. ఎస్పీని కలిసిన వారిలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసుల రెడ్డి, వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు రవీంధ్రనాథ్ రెడ్డి, అంజాద్ బాషా, కడప మేయర్ సురేశ్ బాబు ఉన్నారు.