News April 27, 2024

కడప: బస్సు ఢీకొని మహిళ దుర్మరణం

image

బస్సు ఢీకొని మహిళ మృతి చెందిన ఘటన శనివారం చోటుచేసుకుంది. కడప జిల్లా, పెండ్లిమర్రి మండలం, తిప్పిరెడ్డిపల్లెకు చెందిన శ్రీవాణి భర్త కృష్ణారెడ్డితో కలిసి ఆళ్లగడ్డలో శుభాకార్యానికి వెళ్లి తిరిగి స్వగ్రామానికి బయలుదేరారు. ఈ క్రమంలో పట్టణ సమీపంలోని ఏవీ గోడౌన్స్ వద్ద వీరు వెళుతున్న బైక్‌ను ప్రైవేట్ బస్సు వెనుకనుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శ్రీవాణి అక్కడికక్కడే మృతిచెందింది.

Similar News

News September 8, 2025

ఉల్లిని ప్రభుత్వమే కొంటుంది: మైదుకూరు AMC ఛైర్మన్

image

ఉల్లి సాగు చేసిన రైతులు దళారులను నమ్మవద్దని, మద్దతు ధరతో ప్రభుత్వమే కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటామని మైదుకూరు మార్కెట్ కమిటీ ఛైర్మన్ ఏపీ రవీంద్ర చెప్పారు. పెద్ద బళ్లారి రకం ఉల్లి పంట చేతికొచ్చిందని.. మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేసేందుకు చర్యలు చేపడతామన్నారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి త్వరగా అమలయ్యేలా చూస్తామన్నారు.

News September 8, 2025

వనిపెంట: ఆ నర్సరీలతో నష్టపోతున్న రైతన్నలు..?

image

వనిపెంట ప్రాంతంలో నర్సరీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. వ్యవసాయ అధికారుల నుంచి ఎటువంటి అనుమతులు పొందకుండా ఇష్టానుసారంగా నర్సరీలు నిర్వహిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. నాణ్యత లేని, కల్తీ విత్తనాల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. నర్సరీ యజమానులు కొందరు నాణ్యత లేని విత్తనాల నారును రైతులకు అంటగడుతూ లాభం పొందుతున్నారు. నర్సరీలను తనిఖీ చేసి చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

News September 8, 2025

కడప జిల్లాలో తెరుచుకున్న ఆలయాలు

image

చంద్రగ్రహణం సందర్భంగా కడప జిల్లాలోని అన్ని ఆలయాలు మూత పడిన విషయం తెలిసిందే. గ్రహణం వీడటంతో ఇవాళ తెల్లవారుజామున ఆలయాలు తెరిచారు. ఒంటమిట్ట కోదండరామాలయంలో టీటీడీ అర్చకులు ఆలయ శుద్ధి చేశారు. తర్వాత సంప్రోక్షణ పూజలు నిర్వహించి భక్తులను దర్శనానికి అనుమతించారు. జిల్లాలోని ఇతర ఆలయాల్లోనూ దర్శనాలు తిరిగి మొదలయ్యాయి.