News August 18, 2024
కడప: ‘రూ.కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని పరిరక్షించండి’

కడప మండలం చిన్నచౌక్లో 3 ఎకరాలకు పైబడిన ప్రభుత్వ స్థలం క్రమేపీ అన్యాక్రాంతమవుతోందని, భూ పరిరక్షణకు తగు చర్యలు చేపట్టాలని సీపీఐ నగర కార్యదర్శి వెంకట శివ డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం కడప తహశీల్దార్ కార్యాలయంలో తహశీల్దార్ నారాయణ రెడ్డికి వినతిపత్రం అందించారు. ఆయన మాట్లాడుతూ.. రూ.కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కొందరు ఆక్రమించి రూములు కట్టమంటున్నారన్నారు.
Similar News
News February 8, 2026
గతంలోనూ ప్రొద్దుటూరు టౌన్ ప్లానింగ్ అధికారులపై చర్యలు.!

ప్రొద్దుటూరు మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులపై గతంలోనూ పలుమార్లు షోకాజ్ నోటీస్, సస్పెన్షన్, ఎంక్వైరీలు జరిగాయి. అవినీతి, అక్రమాలు, అధికార దుర్వినియోగం, నిబంధనల ఉల్లంఘనపై చర్యలు చేపట్టారు. గతంలో ఇక్కడ పనిచేసిన ACPలు మునిరత్నం, మునిచంద్రశేఖర్, TPO శివగురుమూర్తి, TPSలు ఇందిర, శిరీషా తదితరులపై చర్యలు చేపట్టారు. ACB, విజిలెన్స్ విచారణలు జరిగాయి. ప్రస్తుత ACP నాగరాజును శుక్రవారం సస్పెండ్ చేశారు.
News February 8, 2026
జమ్మలమడుగు: కన్యతీర్థం అనే పేరు ఎలా వచ్చిందో మీకు తెలుసా?

జమ్మలమడుగు మండలంలోని పెద్దండ్లూరు వద్ద పెన్నా నదీ తీరాన భాను కొండల మధ్య సుమారు 5 వేల ఏళ్లకు పూర్వం ఈ క్షేత్రం వెలిసినట్లు ఆలయంలోని శాసనాలు చెబుతున్నాయి. ఈ క్షేత్రంలోని పుష్కరిణిలో అలనాడు దేవకన్యకలు నిత్యం స్నానమాచరించి అమ్మవారిని సేవించుకోవడం వల్ల ఈ క్షేత్రానికి శ్రీకన్యతీర్థం అని పేరు వచ్చినట్లు పూజారులు చెబుతున్నారు. కన్యతీర్థం, తిరుపతి, శ్రీశైలం ఆలయంలో ఒకే ఆచారం, పోలికలు ఉండటం మరో విశేషం.
News February 8, 2026
ప్రొద్దుటూరులో ACP సస్పెండ్తో నైనా.. అధికారుల అవినీతి తగ్గేనా?

ప్రొద్దుటూరు ACP నాగరాజు సస్పెండ్తో మున్సిపల్ టౌన్ ప్లానింగ్ విభాగం పూర్తి అవినీతి మయంగా మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇళ్లు, షాపులు, అపార్ట్మెంట్లు, కాంప్లెక్సులు ప్రతి నిర్మాణానికి అధికారులు మామూళ్లు తీసుకుంటున్నారట. మామూళ్ల వసూలు కోసం ఏజెంట్లను సైతం పెట్టుకున్నారనే ఆరోపణలున్నాయి. కింది స్థాయి సిబ్బంది మొదలుకొని, TPO, ACP వరకు అందరిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.


