News July 3, 2024
కడప: రూ.1.90 కోట్ల ఎర్రచందనం స్వాధీనం

ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తి గ్రామం నందు దొరికిన రూ.1.90 కోట్లు విలువల గల 158 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ తెలిపారు. బుధవారం స్థానిక ఎస్పీ కార్యాలయానికి పట్టుబడిన ఎర్రచందనం దుంగలతో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. పోట్లదుర్తి క్రాస్ రోడ్డు వద్ద మినీ లారీలో రవాణాకు సిద్ధంగా ఉన్న ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నమన్నారు.
Similar News
News September 19, 2025
కడప: ఉల్లి రైతులకు శుభవార్త

ఉల్లి సాగు చేసిన రైతులంతా తమ పంటను రైతు బజార్లు, మార్కెట్ యార్డుల్లో విక్రయించుకోవచ్చని, ఎటువంటి గుర్తింపు కార్డులు చూపాల్సిన అవసరం లేదని కడప కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ స్పష్టం చేశారు. కిలో రూ.12 చొప్పున రైతులు ఉల్లిని విక్రయించాలని సూచించారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.
News September 19, 2025
కడప: పోలీసుల అదుపులో ఎర్రచందనం స్మగ్లర్లు..!

తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఎర్రచందనం కూలీలను కడప జిల్లా ప్రొద్దుటూరు పోలీసులు అదుపులోకి తీసుకునట్లు తెలుస్తోంది. మండలంలోని పెద్ద శెట్టిపల్లి వద్ద ఎర్రచందనం తరలించేందుకు వెళ్తున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు తనిఖీలు చేశారు. 15 మంది కూలీలను అదుపులోకి తీసుకుంటూ సమాచారం. వీరి వెనుక ఉన్న ప్రధాన స్మగ్లర్ ఎవరనే దానిపై కడపకు తరలించి విచారిస్తున్నట్టు తెలుస్తోంది.
News September 19, 2025
22 నుంచి కడపలో డిగ్రీ కాలేజీల బంద్..!

ఫీజు బకాయిల విడుదల కోసం డిగ్రీ విద్యా సంస్థలు బంద్ చేయాలని వైవీయూ డిగ్రీ కాలేజీ ప్రైవేట్ మేనేజ్మెంట్ అసోసియేషన్ నిర్ణయించింది. అసోసియేషన్ కార్యదర్శి శ్రీను మాట్లాడుతూ.. అసెంబ్లీ సమావేశాల్లో ఫీజు రీయంబర్స్మెంట్పై చర్చ జరపాలన్నారు. ఫీజులు రాక కళాశాలలు నడిపేందుకు ఇబ్బందులు పడుతున్నామన్నారు. ఈనెల 22 నుంచి బంద్ చేస్తామంటూ యూనివర్సిటీ రిజిస్ట్రార్ పద్మకు బంద్ నోటీసులు ఇచ్చారు.