News April 26, 2024
కడప: వివాహిత అనుమానాస్పద మృతి

ఒంటిమిట్ట సచివాలయంలో సర్వేయర్గా పనిచేస్తున్న సాయికుమార్, రాచగుడిపల్లె సచివాలయంలో పనిచేస్తున్న ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. దీనిపై తండ్రి లింగన్న కుమారుడిని మందలించాడు. పెద్దల సమక్షంలో ఇద్దరికీ కౌన్సిలింగ్ ఇచ్చారు. గురువారం ‘మీ కుమార్తె ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని’ సాయికుమార్ తండ్రి లతిక తండ్రికి ఫోన్ చేశాడు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు సీఐ రామచంద్ర తెలిపారు.
Similar News
News April 23, 2025
సిద్దవటం హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు

కడప జిల్లా సిద్దవటం మండలంలో 2022లో జరిగిన అత్యాచారం, హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు, రూ.1లక్ష జరిమానా విధిస్తూ కడప 7వ ఏడీజే కోర్ట్ జడ్జి జీఎస్ రమేష్ కుమార్ తీర్పు ఇచ్చినట్లు ఎస్సై మహమ్మద్ రఫీ తెలిపారు. బుధవారం ఎస్సై మాట్లాడుతూ.. ఓ మహిళ మాచుపల్లి గ్రామ రేణుక ఎల్లమాంబ గుడి ముందు పడుకుని ఉండగా నరసింహులు అలియాస్ బూపడు పట్టుడు కట్టెతో బలంగా కొట్టి గాయపరిచి అత్యాచారం చేయడంతో ఆమె మృతి చెందిందన్నారు.
News April 23, 2025
10th RESULTS: కడప జిల్లాలో సత్తా చాటిన బాలురు

పదో పరీక్షా ఫలితాల్లో కడప జిల్లాలోని బాలురు సత్తాచాటారు. మొత్తం 27,680 మంది పరీక్ష రాయగా 22,361 మంది పాసయ్యారు. 14,278 మంది బాలురులో 11,189 మంది, 13,402 మంది బాలికలు పరీక్ష రాయగా 11,172 మంది పాసయ్యారు. 80.78 శాతం పాస్ పర్సంటేజ్తో కడప జిల్లా 18వ స్థానంలో నిలిచింది. గతేడాది మూడో స్థానంలో నిలవగా.. ఈసారి 18వ స్థానానికి పడిపోయింది.
News April 23, 2025
గుంటూరు యువకుడిపై.. కడప యువతి ఫిర్యాదు

సోషల్ మీడియా పరిచయం పెళ్లి వరకు వెళ్లి మనస్పర్థల కారణంగా నిలిచిపోయింది. అయినప్పటికీ గుంటూరుకు చెందిన ఇమ్రాన్ అనే యువకుడు తనను వేధిస్తున్నాడని బాధిత యువతి కడప పోలీసులకు ఫిర్యాదు చేసింది. పార్లర్ నిర్వహించే కడప యువతికి గుంటూరుకు చెందిన ఇమ్రాన్తో సోషల్ మీడియా ద్వారా పరిచయం ఏర్పడింది. ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చినప్పటికీ ఇమ్రాన్ తనకు ఫొటోలు పంపి వేధిస్తున్నాడని బాధిత యువతి ఫిర్యాదులో పేర్కొంది.