News October 8, 2024
కడప – హైదరాబాదుకు రోజువారీ సర్వీసులు
కడప- హైదరాబాదుకు విమానయాన ఇండిగో సంస్థ రెగ్యులర్ సర్వీసులు నడపనుంది. ఈనెల 27న హైదరాబాదులో ఉదయం11.30 గంటలకు బయలుదేరి, మ.12.40కి కడపకు చేరుతుంది. మళ్లీ కడపలో సా. 3.55 కి తిరుగుపయనమై సా.5.10కి హైదరాబాదు చేరుతుంది. www.goindigo.in వెబ్ సైట్లో టికెట్లు బుక్ చేసుకోవాలి సంస్థ తెలిపింది.
Similar News
News October 8, 2024
రాజంపేటలో భగ్గుమంటున్న కూరగాయల ధరలు
రాజంపేట పట్టణంలో కూరగాయల ధరలు ఆకాశన్నంటుతుండడంతో కొనుగోలుదారులు లబోదిబోమంటున్నారు. మంగళవారం టమాటా, ఎర్రగడ్డలు రూ.100 కి దగ్గరగా ఉన్నాయి. మిగిలిన కూరగాయల పరిస్థితి అదే లాగా ఉందని చెబుతున్నారు. రోజురోజుకీ కూరగాయల ధరలు ఇలా పెరుగుతుండడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
News October 8, 2024
అన్నమయ్య: ‘అర్జీదారుల సమస్యలకు పరిష్కారం చూపాలి’
ప్రజల నుంచి అర్జీలు స్వీకరించాక బాధ్యతగా పనిచేయవలసిన అవసరం అధికారులపై ఉందని జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ పేర్కొన్నారు. సోమవారం అన్నమయ్య జిల్లా కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అర్జీలు స్వీకరించారు. జిల్లాలోని నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు వారి సమస్యలను అర్జీల రూపంలో జిల్లా అధికారులకు అందించారు.
News October 7, 2024
టీడీపీలో చేరిన కమలాపురం పంచాయతీ ఛైర్మన్
కమలాపురం నగర పంచాయతీ ఛైర్మన్ సోమవారం సాయంత్రం టీడీపీ కండువా కప్పుకున్నారు. ఛైర్మన్ మార్పూరు మేరీతోపాటు మరికొందరు కౌన్సిలర్లు వైసీపీ నుంచి టీడీపీలో చేరారు. వీరికి కమలాపురం ఎమ్మెల్యే పుత్తా చైతన్యారెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డిలు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కమలాపురం నగర పంచాయతీ అభివృద్ధి కోసమే తను టీడీపీలో చేరుతున్నట్లు ఛైర్మన్ పేర్కొన్నారు.