News October 1, 2025
కడప: 11 ఏళ్లు అయినా నల్లధనం ఏదీ?

భారత రాజ్యాంగ పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్తంగా యాత్ర చేపట్టిందని తిరుపతి మాజీ ఎంపీ చింతా మోహన్ అన్నారు. కడప ప్రెస్క్లబ్లో ఆయన మాట్లాడుతూ.. మోదీ పీఎంగా అధికారం చేపట్టి 11 ఏళ్లు అవుతున్నా నేటికీ నల్లధనాన్ని వెలికి తీయలేదన్నారు. ప్రజలకు ఆయన ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేదని చెప్పారు. సీఎం చంద్రబాబు ఏ మాత్రం అభివృద్ధి చేయలేదన్నారు.
Similar News
News October 1, 2025
3న గండిక్షేత్రంలో బహిరంగ వేలం

గండిక్షేత్రంలో టెంకాయలు విక్రయాలకు సంబంధించి అక్టోబర్ 3వ తేదీన బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు ఆలయ సహాయ కమిషనర్ వెంకటసుబ్బయ్య, ఛైర్మన్ కావలి కృష్ణతేజ వెల్లడించారు. ఆసక్తి ఉన్నవారు రూ.10 లక్షల డిపాజిట్ చెల్లించి వేలంలో పాల్గొనాలని కోరారు. ఆరోజు ఉదయం 10 గంటలకు వేలం పాట ప్రారంభమవుతుందన్నారు.
News September 30, 2025
కడప: ప్రియుడి కోసం విషం తాగిన యువతి

ప్రియుడు పెళ్లికి నిరాకరించడంతో ఓ యువతి ఆత్మహత్యకు ప్రయత్నించిన ఘటన ఇది. బాధితురాలి వివరాల మేరకు.. పోరుమామిళ్ల మండలం ఈదులపల్లికి చెందిన లక్కినేని దేవరాజ్ను ఓ యువతి ప్రేమించింది. అతను పెళ్లికి నిరాకరించడంతో తనకు న్యాయం జరగలేదంటూ పోరుమామిళ్ల పోలీస్ స్టేషన్ వద్ద పురుగుల మందు తాగింది. వెంటనే ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండటంతో కడప రిమ్స్కు తరలించారు.
News September 30, 2025
కడప: 11 ఏళ్లు అయినా నల్లధనం ఏదీ?

భారత రాజ్యాంగ పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్తంగా యాత్ర చేపట్టిందని తిరుపతి మాజీ ఎంపీ చింతా మోహన్ అన్నారు. కడప ప్రెస్క్లబ్లో ఆయన మాట్లాడుతూ.. మోదీ పీఎంగా అధికారం చేపట్టి 11 ఏళ్లు అవుతున్నా నేటికీ నల్లధనాన్ని వెలికి తీయలేదన్నారు. ప్రజలకు ఆయన ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేదని చెప్పారు. సీఎం చంద్రబాబు ఏ మాత్రం అభివృద్ధి చేయలేదన్నారు.