News May 24, 2024

కడప: ALERT.. నిమిషం ఆలస్యమైన నో ఎంట్రీ

image

కడప జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియట్, టెన్త్ అడ్వాన్సుడ్, సప్లిమెంటరీ పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయని ఆర్ఐఓ వెంకట సుబ్బయ్య తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 37 ఇంటర్ పరీక్ష కేంద్రాల్లో 17,688 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నట్లు పేర్కొన్నారు. 16 పరీక్షా కేంద్రాల్లో 3528 మంది టెన్త్ విద్యార్థులు పరీక్షలు రాస్తున్నట్లు వివరించారు. నిమిషం ఆలస్యమైన ప్రవేశం నిషిద్ధమని RIO స్పష్టం చేశారు.

Similar News

News October 16, 2024

సజావుగా ఇసుక పంపిణీ చేయాలి: కడప కలెక్టర్

image

ప్రజలకు సజావుగా ఇసుక పంపిణీ చేసి ప్రభుత్వానికి మంచి పేరు ప్రతిష్ఠలు తేవాలని కడప జిల్లా కలెక్టర్ శంకర్ లోతేటి అన్నారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లాలో ఇసుక పంపిణీపై సంబంధిత అధికారులతో, ఇసుక ఏజెన్సీ ప్రతినిధులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు అందరికీ అందుబాటులో ఇసుకను అందించాలని ప్రభుత్వానికి, జిల్లాకు ప్రతిష్ఠలు తీసుకురావాలని చెప్పారు.

News October 16, 2024

కడప అమీన్ పీర్ దర్గా ఉర్సు ఉత్సవాలకు సీఎంకు ఆహ్వానం

image

కడప నగరంలో నవంబర్ 16 నుంచి 20 వరకు జరగనున్న కడప అమీన్ పీర్ దర్గా ఉర్సు ఉత్సవాలకు సీఎం చంద్రబాబు నాయుడుని దర్గా పెద్దలు ఆహ్వానించారు. సచివాలయంలో సీఎంను మంగళవారం కలిసి దర్గా ముతావల్లి ఖ్వాజా స‌య్య‌ద్ షా ఆరిఫుల్లా హుస్సేనీ ఆహ్వాన పత్రిక అందించారు. సీఎం సానుకూలంగా స్పందించారని మత పెద్దలు తెలిపారు.

News October 15, 2024

కమలాపురం పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన ఎస్పీ

image

సామాజిక తనిఖీలో భాగంగా కమలాపురం పోలీస్ స్టేషన్‌ను మంగళవారం కడప జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు పరిశీలించారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం లాంటి అసాంఘిక కార్యక్రమాలపై ఉక్కుపాదం మొపుతాం మోపుతామన్నారు. కష్టాల్లో వచ్చిన ప్రజలకు పోలీసులు అండగా నిలవాలిని ఫ్రెండ్లీ పోలీసింగ్ లాంటి అంశాలపై సిబ్బందికి తగు సూచనలు ఇచ్చిన ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు.