News March 21, 2025

కడప MP అవినాశ్‌కి కీలక బాధ్యత.!

image

పార్లమెంట్ ఎస్టిమేట్ (అంచనాల) కమిటీ సభ్యునిగా కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి ఎన్నికయ్యారు. ఈ అంచనాల కమిటీ పార్లమెంటులో అత్యున్నతమైన కమిటీ. దేశం మొత్తం మీద 543 పార్లమెంట్ సభ్యుల నుంచి 30 మందిని ఎన్నుకుంటారు. ఇందులో భాగంగా.. వైఎస్సార్సీపీ నుంచి కడప జిల్లా పార్లమెంట్ సభ్యులు YS అవినాశ్ రెడ్డి ఎన్నికవ్వడం చాలా సంతోషమని కార్యకర్తలు తెలిపారు.

Similar News

News March 28, 2025

క్రికెట్‌లో సత్తా చాటిన ఎర్రగుంట్ల క్రీడాకారిణి

image

వైయస్సార్ కడపజిల్లా, ఎర్రగుంట్ల మండలం యర్రంపల్లి గ్రామానికి చెందిన ఎన్.శ్రీచరణి బీసీసీఐ సీనియర్ ఉమెన్స్ ఛాలెంజర్ ట్రోఫీలో 6 వికెట్లు తీసి సత్తా చాటింది. గురువారం డెహ్రాడూన్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో నిర్వహించిన మల్టీ డేస్ క్రికెట్ మ్యాచ్‌లో టీమ్-బీకి ప్రాతినిధ్యం వహించిన శ్రీచరణి తొలిరోజు మ్యాచ్‌లో 32 ఓవర్లు వేసి 8 మెయిడిన్ ఓవర్లు, 6 వికెట్లు తీసి సత్తా చాటింది.

News March 27, 2025

కడప జిల్లా ZPTCలకు కృతజ్ఞతలు తెలిపిన ఎంపీ

image

కడప జిల్లా పరిషత్ ఛైర్మన్ ఎన్నికకు సహకారం అందించిన ఉమ్మడి కడప జిల్లా ZPTCలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి పేర్కొన్నారు. వైయస్సార్, జగన్ మీద అభిమానంతో రామ గోవింద్ రెడ్డికి ప్రతి ఒక్కరూ సహకారం అందించారని అన్నారు. భవిష్యత్తులో ప్రజా సమస్యల పట్ల జిల్లా పరిధిలోని ZPTCలు పోరాటం కొనసాగించాలని సూచించారు.

News March 27, 2025

ప్రొద్దుటూరు: 9వ తరగతి విద్యార్థిపై పోక్సో కేసు

image

ప్రొద్దుటూరులో 9వ తరగతి విద్యార్థిపై పోక్సో కేసు నమోదైంది. మండలంలోని ఓ ప్రైవేట్ స్కూల్‌కు చెందిన విద్యార్థి 32 ఫేక్ ఇన్‌స్టాగ్రాం అకౌంట్లతో తన క్లాస్ అమ్మాయిలను వేధించాడు. విషయం తెలిసిన టీచర్ విద్యార్థిని హెచ్చరించారు. తమ బిడ్డనే మందలిస్తారంటూ సదరు విద్యార్థి తల్లిదండ్రులు టీచర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వాళ్ల విచారణలో అసలు విషయం బయటపడింది. దీంతో వారితో పాటు మరో వ్యక్తిపై పోక్సో కేసు నమోదైంది.

error: Content is protected !!