News March 12, 2025
కథలాపూర్: నేటి నుంచి శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు

కథలాపూర్ మండలం తక్కళపల్లిలో శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు బుధవారం నుంచి ప్రారంభమవుతాయని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. బుధ, గురువారాలు స్వామివారి పల్లకిపై ఊరేగింపు, శుక్రవారం జాతర మహోత్సవాలు, శనివారం వేకువజామున స్వామివారి రథోత్సవం నిర్వహిస్తామన్నారు. భక్తులు అధికసంఖ్యలో వచ్చి విజయవంతం చేయాలన్నారు.
Similar News
News November 7, 2025
వనపర్తిలో నవంబర్ 10న అప్రెంటీషిప్ మేళా

వనపర్తి పట్టణంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో నవంబర్ 10న అప్రెంటిషిప్ మేళా ఉంటుందని కళాశాల ప్రిన్సిపల్ కే.రమేష్ బాబు తెలిపారు. ఐటీఐ పాస్ అయిన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అభ్యర్ధులు అప్రెంటిస్ షిప్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ మేళాకు ధ్రువీకరణ పత్రాలతో రావాలన్నారు. వివరాలకు ట్రైనింగ్ ఆఫీసర్ ఎంఈ హక్ను లేదా సెల్ నంబర్లను 9849244030, 9490202037 సంప్రదించాలన్నారు.
News November 7, 2025
డికాక్ సూపర్ సెంచరీ.. ఒంటి చేత్తో గెలిపించాడు

మూడు వన్డేల సిరీస్లో భాగంగా పాక్తో జరిగిన రెండో వన్డేలో SA బ్యాటర్ క్వింటన్ డికాక్ శతకంతో చెలరేగారు. 270 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ప్రొటీస్ ప్లేయర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. డికాక్ 119 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సుల సాయంతో 123* పరుగులు చేశారు. టోనీ(76), ప్రిటోరియస్(46) రాణించారు. కేవలం 40.1 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి టార్గెట్ రీచ్ అయ్యారు. దీంతో 1-1తో సిరీస్ను సమం చేశారు.
News November 7, 2025
NZB: 38.15 లక్షలు తీసుకొని మోసగించిన మహిళ అరెస్ట్

నిజామాబాద్లో డబ్బుల పేరుతో ప్రజలను మోసగించిన మహిళను అరెస్టు చేసినట్లు సౌత్ సీఐ సురేష్ తెలిపారు. ఇటీవల మోపాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఐదుగురి వద్ద 3 ఎకరాల భూమి ఇస్తానని నమ్మించి వారి నుంచి రూ.38.15 లక్షలు తీసుకొని మోసం చేసింది. దీంతో బాధితుల ఫిర్యాదు మేరకు స్వర్ణ ప్రమీలను అదుపులోకి తీసుకొని రిమాండ్కు తరలించారు. ఆమె నుంచి బాధితుల చెక్కులు, ప్రాంసరీ నోట్లు, స్వాధీనం చేసుకున్నట్లు సీఐ వెల్లడించారు.


