News April 12, 2025

కథలాపూర్: బైకు అదుపుతప్పి యువకుడి మృతి

image

జగిత్యాల జిల్లా కథలాపూర్ మండల కేంద్రానికి చెందిన పల్లికొండ అజయ్ (17) అనే యువకుడు శుక్రవారం రాత్రి బైకు అదుపుతప్పి పడిపోగా మృతిచెందినట్టు పోలీసులు పేర్కొన్నారు. అజయ్ బైక్‌పై గ్రామ శివారులోకి వెళ్తుండగా.. ప్రమాదవశాత్తు రోడ్డు పక్కకు దూసుకెళ్లి పడిపోయారు. తలకు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. సంఘటనపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

Similar News

News January 6, 2026

రష్యా లేకుంటే గయానా.. భారత్ తగ్గేదే లే!

image

రష్యా నుంచి భారత్ ఆయిల్ <<18775987>>దిగుమతులు<<>> తగ్గించుకున్నా పెద్దగా ఇబ్బంది లేదని విశ్లేషకులు చెబుతున్నారు. దక్షిణ అమెరికా దేశమైన గయానా నుంచి గతేడాది NOVలో 4 మిలియన్ బ్యారెళ్ల క్రూడాయిల్ ఉన్న భారీ ఓడలు ఇండియాకు బయల్దేరాయి. ఈ నెలలో ఆ ఆయిల్ మన దేశానికి చేరుకోనుంది. అటు తమ దేశంలోని చమురు బావులను తవ్వుకోవచ్చని గయానా మన దేశానికి ఆఫర్ ఇచ్చింది. దీర్ఘకాలంలో ఇవి ఇండియాకు ఎంతో మేలు చేయనున్నాయి.

News January 6, 2026

NZB: కవిత మా పార్టీలో చేరొచ్చు: కాంగ్రెస్‌ MLA

image

HYD ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ MLA మల్‌రెడ్డి రంగారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్ MLC కల్వకుంట్ల కవిత కాంగ్రెస్‌లో చేరే అవకాశాలు ఉన్నాయని ఆయన హింట్ ఇచ్చారు. కాగా, గతంలో ఆయన చెప్పినట్లే దానం నాగేందర్ లాంటి వాళ్లు కాంగ్రెస్‌లో చేరారని గుర్తు చేశారు. దీనిపై అఫీషియల్ స్టేట్‌మెంట్ రావాల్సి ఉంది.

News January 6, 2026

ఖమ్మం: కొత్త పేరు సూచిస్తే.. రూ.4 వేల బహుమతి

image

ఖమ్మం వెలుగుమట్ల అర్బన్ పార్కుకు కొత్త పేరు, ట్యాగ్ లైన్ సూచించి, రూ.4 వేల బహుమతి గెలుచుకోవాలని అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ DFO సిద్ధార్థ్ విక్రమ్ సింగ్‌తో కలిసి వెలుగుమట్ల అర్బన్ పార్క్ పబ్లిక్ కాంపిటీషన్ గోడపత్రికను ఆవిష్కరించారు. JAN 10 నుంచి 20 వరకు పబ్లిక్ కాంపిటీషన్ ఉంటుందని, ఆసక్తి గలవారు అర్బన్ పార్కుకు కొత్త పేరు ట్యాగ్ సూచించాలన్నారు.