News April 12, 2025

కథలాపూర్: బైకు అదుపుతప్పి యువకుడి మృతి

image

జగిత్యాల జిల్లా కథలాపూర్ మండల కేంద్రానికి చెందిన పల్లికొండ అజయ్ (17) అనే యువకుడు శుక్రవారం రాత్రి బైకు అదుపుతప్పి పడిపోగా మృతిచెందినట్టు పోలీసులు పేర్కొన్నారు. అజయ్ బైక్‌పై గ్రామ శివారులోకి వెళ్తుండగా.. ప్రమాదవశాత్తు రోడ్డు పక్కకు దూసుకెళ్లి పడిపోయారు. తలకు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. సంఘటనపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

Similar News

News September 16, 2025

మరింత సులభంగా మూవీ షూటింగ్స్: దిల్ రాజు

image

TG: రాష్ట్రంలో సినీ రంగాభివృద్దికి కావాల్సిన అనుమతులన్నీ ఒకే విండో ద్వారా పొందేందుకు ప్రభుత్వం ‘ఫిలిమ్స్ ఇన్ తెలంగాణ’ అని ఓ వెబ్ సైట్ రూపొందిస్తోంది. ‘జాతీయ, అంతర్జాతీయ స్థాయి సినీ నిర్మాతలు కేవలం స్క్రిప్ట్‌తో వస్తే వారి మూవీకి కావాల్సిన లొకేషన్లు, అనుమతులు, టెక్నీషియన్లు, HYDతోపాటు రాష్ట్రంలోని హోటళ్లతో పాటు సంపూర్ణ సమాచారంతో ఈ వెబ్ సైట్ రూపొందిస్తున్నాం’ అని FDC చైర్మన్ దిల్ రాజు తెలిపారు.

News September 16, 2025

ప్రకాశం: ప్రభుత్వ కళాశాలలో వికృతి చేష్టలు.. ఐదుగురిపై వేటు

image

ప్రకాశం జిల్లా కొమరోలులోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అధ్యాపకులు వికృత చేష్టలు చేస్తున్నట్లు విద్యార్థులు అధికారులకు లేఖల రూపంలో ఫిర్యాదు చేశారు. గుంటూరు ఆర్జేడీ పద్మజ సోమవారం కళాశాలలో విచారణ చేపట్టి నలుగురు అధ్యాపకులను తాత్కాలికంగా విధుల నుంచి తొలగిస్తున్నామన్నారు. బోధనేతర సిబ్బందిని డిప్యూటేషన్‌పై వేరే కళాశాలకు పంపించామని తెలిపారు.

News September 16, 2025

మళ్లీ భూముల వేలం.. ఎకరాకు రూ.101 కోట్లు

image

TG: రాష్ట్ర ప్రభుత్వం మరోసారి భూముల వేలానికి సిద్ధమైంది. HYD ఐటీ కారిడార్‌ సమీపంలోని రాయదుర్గంలో 18.67 ఎకరాల ప్రభుత్వ భూమికి అక్టోబర్ 6న ఈ-వేలం నిర్వహించనుంది. OCT 1 వరకు బిడ్ల దాఖలుకు అవకాశమిచ్చింది. రూ.2వేల కోట్ల ఆదాయమే లక్ష్యంగా ఎకరాకు కనీస ధరను ఏకంగా రూ.101 కోట్లుగా నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ(టీజీఐఐసీ) అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది.