News March 3, 2025

కథలాపూర్ మండలంలో వదినపై మరిది గొడ్డలితో దాడి

image

కథలాపూర్ మండలం ఇప్పపల్లిలో దారుణం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన యగండ్ల లక్ష్మిపై మరిది చిన్నరాజం ఇద్దరి మధ్య మొరం విషయంలో గొడవ జరిగింది. మాట మాట పెరిగడంతో మరిది యగండ్ల చిన్న రాజం వదిన తలపై గొడ్డలితో దాడిచేశాడు. దీంతో వదిన లక్ష్మికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు ఆసుపత్రికి తరలించారు. పూర్తివివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News September 16, 2025

కర్నూలు: సత్తా చాటిన కడప జట్లు

image

కర్నూలులో రెండు రోజుల పాటు 17వ రాష్ట్రస్థాయి మినీ సబ్ జూనియర్ హ్యాండ్ బాల్ పోటీలు జరిగాయి. బాలురు, బాలికల విభాగంలో కడప జట్టు మొదటి స్థానంలో నిలిచి డబుల్ క్రౌన్ సాధించింది. కర్నూలు బాలుర జట్టు మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం సాధించింది. విజేతలకు జిల్లా ఒలంపిక్ సంఘ అధ్యక్షుడు రామాంజనేయులు, ఏపీ హ్యాండ్ బాల్ సంఘ అధ్యక్షుడు శ్రీనివాసులు బహుమతులు అందజేశారు.

News September 16, 2025

భద్రాచలం: APలో కలిశాక ఆ 5 గ్రామాల పరిస్థితి దుర్భరం

image

AP-TG విభజన సమయంలో APలో కలిసిన 5 గ్రామాల ప్రజల జీవనం ఆగమ్యగోచరంగా మారింది. సరిహద్దుల్లో ఉన్న ఎటపాక, కన్నాయిగూడెం, పిచుకులపాడు, గుండాల, పురుషోత్తపట్నంలో అభివృద్ధి పూర్తిగా నిలిచిపోయిందని గ్రామస్థులు వాపోతున్నారు. ఈ గ్రామాలు భద్రాచలానికి 9 KM, రంపచోడవరంనకు 130 KM దూరంలో ఉన్నాయి. దీంతో విద్యార్థుల చదువులు, అభివృద్ధి దుర్భరంగా తయారయ్యాయంటున్నారు. తమను తిరిగి భద్రాచలంలో చేర్చాలని కోరుతున్నారు.

News September 16, 2025

కామారెడ్డి: ఈ నెల 17న కలెక్టరేట్‌లో జాబ్ మేళా

image

కామారెడ్డి జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఈ నెల 17న కలెక్టరేట్‌లోని ఉపాధి కల్పన కార్యాలయంలో జాబ్ మేళా ఏర్పాటు చేసినట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి రవికిరణ్ తెలిపారు. ప్రైవేట్ రంగంలో పని చేయడానికి ఆసక్తి గల వారు జాబ్ మేళాకు హాజరు కావాలని సూచించారు. 18 నుంచి 25 ఏళ్ల వారు అర్హులని చెప్పారు. ఎమ్మెస్సీ కెమిస్ట్రీ చదివినవారు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. ధ్రువ పత్రాలతో హాజరు కావాలన్నారు.