News February 12, 2025

కథలాపూర్: వృద్ధురాలి మెడలో నుంచి బంగారు ఆభరణాలు లాక్కెళ్ళిన దొంగలు

image

జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం ఊటుపల్లి గ్రామంలో గజెల్లి లక్ష్మి అనే వృద్ధురాలి మెడలో నుంచి ఏడు తులాల బంగారు ఆభరణాలను బుధవారం మధ్యాహ్నం ఇద్దరు మహిళా దొంగలు లాకెళ్లినట్లు గ్రామస్థులు తెలిపారు. లక్ష్మి అనే వృద్ధురాలు ఇంట్లో ఉండగా.. ఆధార్ కార్డు పరిశీలిస్తామని చెప్పి ఇద్దరు మహిళలు మాట్లాడుతూ వెంటనే వృద్ధురాలి మెడలో నుంచి బంగారు ఆభరణాలు లాక్కెల్లారు. పోలీసులు వచ్చి వివరాలు సేకరిస్తున్నారు.

Similar News

News February 12, 2025

APPLY NOW.. నెలకు రూ.3000

image

చిన్న, సన్న కారు రైతులను ఆర్థికంగా ఆదుకునేలా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం ప్రధానమంత్రి కిసాన్ మాన్‌ధన్ యోజన. ఈ పథకం ద్వారా 60 ఏళ్లు నిండిన రైతులకు నెలకు రూ.3000 పెన్షన్ ఇస్తారు. 18 నుంచి 40 ఏళ్లలోపు వయసున్న రైతులు దరఖాస్తు చేసుకోవచ్చు. నెలకు రూ.55 నుంచి రూ.200 వరకు ప్రీమియం చెల్లించాలి. ఒక వేళ రైతు చనిపోతే అతని భార్యకు నెలకు రూ.1500 పెన్షన్ ఇస్తారు. దరఖాస్తు చేసేందుకు ఇక్కడ <>క్లిక్ <<>>చేయండి.

News February 12, 2025

NRPT: స్థానిక ఎన్నికలకు అధికారులు సన్నద్ధం కావాలి: కలెక్టర్

image

గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల నిర్వహణ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని విధాలుగా సన్నద్ధం కావాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులకు నారాయణపేట పట్టణంలోని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌లో బుధవారం మొదటి దశ శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎన్నికల నిబంధన పై పూర్తి అవగాహన పెంపొందించుకోవాలని అన్నారు.

News February 12, 2025

NZB: సీఎం రూ.35 వేలు బాకీ: ఎమ్మెల్సీ క‌విత

image

తెలంగాణ జాగృతి ఆధ్వ‌ర్యంలో మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా మార్చి 8న హైద‌రాబాద్‌లో త‌ల‌పెట్ట‌నున్న మ‌హిళా శంఖారావం స‌భ పోస్ట‌ర్‌ను ఎమ్మెల్సీ కల్వకుంట్ల క‌విత బుధ‌వారం త‌న నివాసంలో ఆవిష్క‌రించారు. ఆమె మాట్లాడుతూ అధికారంలోకి వచ్చి 14 నెలలు అయినా మహిళలకు ప్రతి నెల రూ.2500 ఇవ్వడం లేదని, రేవంత్ రెడ్డి మహిళలకు రూ.35 వేల చొప్పున బాకీ పడ్డారన్నారు. ప్రతీ మహిళా బ్యాంకు ఖాతాలో రూ.35వేలు జమ చేయాలన్నారు.

error: Content is protected !!