News August 16, 2025
కథలాపూర్: సౌదీ దేశం నుంచి స్వగ్రామానికి చేరిన మృతదేహం

జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం భూషణరావుపేటకు చెందిన సంగెం వినోద్(30) సౌదీ అరేబియా దేశంలో గత నెల 22న ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతదేహం శుక్రవారం ఇంటికి చేరడంతో కుటుంబసభ్యులు, బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. వినోద్ ఉపాధి నిమిత్తం ఏడాది క్రితం సౌదీ అరేబియా దేశానికి వెళ్లాడు. అక్కడ కార్మికుడిగా పని చేస్తున్నప్పటికీ సరైన వేతనం లేదని మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు గ్రామస్థులు పేర్కొన్నారు.
Similar News
News August 16, 2025
KMR: జిల్లాలో తగ్గిన రోడ్డు ప్రమాదాలు

కామారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదాలు తగ్గుముఖం పట్టినట్లు జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. గతేడాది 170 రోడ్డు ప్రమాదాల్లో 179 మంది మరణించగా, 315 మంది గాయపడ్డారు. ఈ ఏడాది ఇదే కాలంలో 1129 ప్రమాదాలలో 135 మంది మరణించగా, 272 మంది గాయపడ్డారు. రోడ్డు ప్రమాదాల నివారణలో కామారెడ్డి జిల్లా పోలీసులు సాధించిన ఈ పురోగతిని రాష్ట్ర డీజీపీ డా. జితేందర్ అభినందించారు.
News August 16, 2025
కాశీబుగ్గలో 20 కేజీల గంజాయి స్వాధీనం

ఒడిశాకు చెందిన నలుగురు గంజాయి అక్రమ రవాణాదారులను పలాస రైల్వే స్టేషన్లో అరెస్టు చేసినట్టు కాశీబుగ్గ సీఐ సూర్యనారాయణ శుక్రవారం తెలిపారు. మోహనా బ్లాక్ పడొవ గ్రామానికి చెందిన నాయక్, రాహిత్ బిర, జునైలు, గుమ్మా గ్రామానికి చెందిన సురుసింగ్ వద్ద 20 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నామని వివరించారు. అరెస్టు చేసి పలాస కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించడంతో జైలుకి పంపించామని అన్నారు.
News August 16, 2025
HYD: ఐదేళ్ల బాలుడిపై లైంగిక దాడి.. హత్య

ఐదేళ్ల బాలుడిపై లైంగిక దాడికి పాల్పడి హత్య చేసిన ఘటన ఉప్పల్ PS పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాలు.. రామంతపూర్లో నివాసముండే ఓ వ్యక్తి టింబర్ డిపోలో పని చేస్తున్నాడు. ఈ నెల 12న కుమారుడు కనిపించడం లేదంటూ PSలో ఫిర్యాదు చేయగా సీసీ ఫుటేజీ ఆధారంగా అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. కమర్ అనే వ్యక్తి బాలుడికి మాయమాటలు చెప్పి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడి గొంతు నులిమి హత్య చేశాడు. కేసు నమోదైంది.