News February 15, 2025
కదిరిలో విద్యార్థిని కొట్టిన టీచర్పై కేసు

కదిరిలో విద్యార్థిని కొట్టిన టీచర్పై కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ నారాయణరెడ్డి తెలిపారు. ఆయన వివరాల మేరకు.. నల్లగుట్టవీధికి చెందిన అశ్విని కుమారుడు భానుతేజ ఓ ప్రవేటు స్కూల్లో 5వ తరగతి చదువుతున్నారు. స్కూల్లో టీచర్ మధు అడిగిన ప్రశ్నకు తన కుమారుడు సమాధానం చెప్పలేదని కర్రతో కొట్టాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. గాయాలయ్యాయని చెప్పారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు.
Similar News
News July 4, 2025
నిర్మల్ జిల్లాలో వ్యక్తి ఆత్మహత్య

నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం రాజుర గ్రామ వాసి తోట దేవన్న(52) కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడని స్థానికులు తెలిపారు. ఈ విషయమై కుటుంబీకులు మందలించగా మనస్తాపం చెందిన ఆయన పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడన్నారు. వెంటనే కుటుంబీకులు గమనించి అతడిని అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఈరోజు మృతిచెందాడని చెప్పారు. మృతుడి కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్ఐ అశోక్ తెలిపారు.
News July 4, 2025
ఆయిల్ పామ్ సాగులో రైతులను ప్రోత్సహించాలి: కలెక్టర్

జిల్లాలో ఆయిల్ పామ్ పంట సాగులో రైతులను ప్రోత్సహించాలని కలెక్టర్ స్నేహ శబరీష్ వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులను ఆదేశించారు. శుక్రవారం హనుమకొండ కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో జిల్లాలో ఆయిల్ పామ్ పంట సాగుకు తీసుకోవాల్సిన చర్యలు, రైతులకు ప్రోత్సాహంపై ఉద్యాన, వ్యవసాయ శాఖల అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
News July 4, 2025
బ్యాంక్ ఆఫ్ బరోడాలో 2,500 జాబ్స్

బ్యాంక్ ఆఫ్ బరోడాలో లోకల్ బ్యాంక్ ఆఫీసర్ (LBO) పోస్టుల దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. మొత్తం 2,500 ఖాళీలు ఉన్నాయి. డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు. వయసు 21-30 ఏళ్ల మధ్య ఉండాలి. బ్యాంకుల్లో ఒక సంవత్సరం పని చేసిన అనుభవం ఉండాలి. ఆన్లైన్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్/ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తులకు చివరి తేదీ జులై 24. ప్రారంభ వేతనం నెలకు రూ.48,480. పూర్తి వివరాల కోసం ఇక్కడ <