News May 31, 2024
కనిగిరి: గుండెపోటుతో బస్సులో ఫొటోగ్రాఫర్ మృతి

ఒంగోలు నుంచి కనిగిరికి వస్తున్న ఆర్టీసీ బస్సులో వెలిగండ్ల మండలం అగ్రహారానికి చెందిన ఫొటోగ్రాఫర్ రామకృష్ణ గుండెపోటుతో మృతి చెందారు. ఒంగోలులో చదువుతున్న తన కుమార్తెను చూసేందుకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. కనిగిరి డిపోలో ఆర్టీసీ డ్రైవర్ వెళ్లి చూడగా.. సీటులో పడిపోయి ఉన్నాడు. రామకృష్ణను ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News November 11, 2025
ప్రకాశం జిల్లాకు సీఎం.. షెడ్యూల్ ఇదే.!

ఇవాళ CM చంద్రబాబు జిల్లాలోని పెద్ద చెర్లో పల్లి (M) పెద ఇర్లపాడులోని MSME పార్కుల ప్రారంభోత్సవానికి రానున్నారు. ఇవాళ ఉదయం 9:30 గంటలకు ఉండవల్లి నుంచి హెలికాఫ్టర్లో బయలుదేరి 10:15 కు ఇర్లపాడులోని హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన 10:35 గంటలకి సభా ప్రాంగణానికి వచ్చి MSME పార్కులను ప్రారంభిస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం 12:15 గం.కు ఉండవల్లికి బయలుదేరుతారు.
News November 10, 2025
ఢిల్లీలో పేలుళ్లు.. ప్రకాశం జిల్లా వ్యాప్తంగా పోలీసుల తనిఖీలు!

ఢిల్లీలో పేలుళ్ల నేపథ్యంలో ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పోలీసులు సోమవారం రాత్రి విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ప్రధానంగా ఒంగోలులోని బస్టాండ్, రైల్వే స్టేషన్, ఇతర ప్రాంతాలలో డాగ్ స్క్వాడ్ బృందంతోపాటు పోలీసులు తనిఖీలు నిర్వహించి, అనుమానిత వ్యక్తుల వివరాలను ఆరా తీశారు. ఈ తనిఖీలు జిల్లా వ్యాప్తంగా నిర్వహించినట్లు ఎస్పీ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.
News November 10, 2025
రేపే సీఎం రాక.. బందోబస్తు వివరాలు వెల్లడించిన ఎస్పీ!

రేపు పీసీపల్లి మండలంలో సీఎం పర్యటన సందర్భంగా ఏర్పాటుచేసిన బందోబస్తు వివరాలను ఎస్పీ హర్షవర్ధన్ రాజు సోమవారం తెలిపారు. ఇద్దరు ఏఎస్పీలు, 8 మంది డీఎస్పీలు, 20 మంది సీఐలు, 49 మంది ఎస్ఐలతో పాటు మొత్తం 800 మంది పోలీసులు, హోం గార్డులు, ఇతర భద్రతా సిబ్బందిని బందోబస్తు విధుల్లో నియమించినట్లు చెప్పారు. ట్రాఫిక్ జామ్లు ఏర్పడకుండా 6 ప్రత్యేక మొబైల్ బైక్ పెట్రోలింగ్ టీమ్లను కూడా ఏర్పాటు చేశామన్నారు.


