News November 9, 2024
కనిగిరి: వదిన గొంతు కోసిన మరిది

బ్లేడుతో ఓ వ్యక్తి మహిళ గొంతు కోసిన ఘటన కనిగిరి పట్టణంలో శుక్రవారం రాత్రి జరిగింది. పట్టణంలోని గార్లపేట రహదారిలోని హోటల్లో టిఫిన్ చేస్తున్న పోలా కోటేశ్వరమ్మ అనే మహిళను మరిది ఆంథోనీ అనే వ్యక్తి బ్లేడుతో గొంతు కోసి గాయపరిచాడు. బంధువులు ఆమెను వెంటనే పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. సీఐ ఖాజావలి, ఎస్సై శ్రీరామ్ ఆసుపత్రికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News November 26, 2025
దశాబ్దాల డ్రీమ్.. ఫైనల్గా మార్కాపురం డిస్ట్రిక్ట్!

మార్కాపురం కేంద్రంగా ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేస్తామన్న హామీని CM చంద్రబాబు నాయుడు నెరవేర్చారు. 1970లో ఒంగోలు జిల్లా ఏర్పాటైనప్పటి నుంచి మార్కాపురం కేంద్రంగా ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఉంది. సీఎం నిర్ణయంతో దశాబ్దాల కల తీరడంతో పశ్చిమ ప్రకాశం ప్రాంత వాసుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. 21 మండలాలతో రాష్ట్రంలో 28వ జిల్లాగా మార్కాపురాన్ని ఏర్పాట్లు చేస్తూ త్వరలో గెజిట్ విడుదలకానుంది.
News November 26, 2025
దశాబ్దాల డ్రీమ్.. ఫైనల్గా మార్కాపురం డిస్ట్రిక్ట్!

మార్కాపురం కేంద్రంగా ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేస్తామన్న హామీని CM చంద్రబాబు నాయుడు నెరవేర్చారు. 1970లో ఒంగోలు జిల్లా ఏర్పాటైనప్పటి నుంచి మార్కాపురం కేంద్రంగా ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఉంది. సీఎం నిర్ణయంతో దశాబ్దాల కల తీరడంతో పశ్చిమ ప్రకాశం ప్రాంత వాసుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. 21 మండలాలతో రాష్ట్రంలో 28వ జిల్లాగా మార్కాపురాన్ని ఏర్పాట్లు చేస్తూ త్వరలో గెజిట్ విడుదలకానుంది.
News November 26, 2025
మార్కాపురం జిల్లా.. ఈ ప్రత్యేకతలు తెలుసా?

మార్కాపురం జిల్లా ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ పడగా జిల్లా బలాలపై సరికొత్త చర్చ సాగుతోంది. జలప్రసాదిని వెలుగొండ ప్రాజెక్ట్ పూర్తైతే జిల్లా మరింత సస్యశ్యామలం కానుంది. కొత్త జిల్లా ఏర్పడిన కొన్ని నెలల్లోనే వెలుగొండ జలాలు అందించేందుకు ప్రభుత్వం కూడా సిద్ధమవుతోంది. అలాగే ఆసియాలోనే అతిపెద్ద రెండవ చెరువైన కంభం చెరువు, నల్లమల అందాలు కొత్త జిల్లాకు బలమే కాక, సరికొత్త అందాలుగా కూడా చెప్పవచ్చు.


