News January 27, 2025
కన్నుల పండువగా ‘అట్ హోమ్’ కార్యక్రమం

76వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని కలెక్టర్ బంగ్లా ప్రాంగణంలో ఆదివారం సాయంత్రం అత్యంత ఆహ్లాదకరమైన వాతావరణంలో కన్నుల పండువగా “అట్ హోమ్” కార్యక్రమం జరిగింది. కలెక్టర్ శ్రీధర్ చామకూరి ఏర్పాటు చేసిన ఈ తేనీటి విందులో జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్, డీఆర్ఓ మధుసూధనరావు, సబ్ కలెక్టర్లు మేఘ స్వరూప్, నైదియాదేవి, ఆర్డీఓ శ్రీనివాసులు, ఏఎస్పీ వెంకటాద్రి పాల్గొన్నారు.
Similar News
News February 26, 2026
తీర్థం ఎలా తీసుకోవాలి?

తీర్థం స్వీకరించడానికి హస్త గోకర్ణ ముద్రను ఉపయోగించాలి. కుడిచేతి బొటనవేలుతో చూపుడు వేలును నియంత్రించాలి. మిగిలిన 3 వేళ్లను ముందుకు చాచాలి. దీన్నే గోకర్ణ ముద్ర అంటారు. ఇంట్లో పూజ ముగిశాక 3 సార్లు, గుడిలో అయితే ఓసారి తీర్థం తీసుకోవాలి. తీర్థాన్ని శబ్దం రాకుండా, కింద పడకుండా సేవించాలి. ఉపవాసం చేసే వారు ఉదయం, సాయంత్రం తీర్థం తీసుకునేటప్పుడే ఉపవాసం పూర్తయినట్లు లెక్క.
News February 26, 2026
364 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తుకు ఎల్లుండే లాస్ట్ డేట్

యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో 364 అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. బీఈ, బీటెక్, డిగ్రీ(BA, BCom, BBA, LLB), డిప్లొమా, ఐటీఐ అర్హత గల వారు NATS/NAPS పోర్టల్లో అప్లై చేసుకోవచ్చు. వయసు 18 నుంచి 25ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్లో సడలింపు ఉంది. అకడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://www.uraniumcorp.in
News February 26, 2026
HYD: రూ.2వేల కోట్లతో ఆవుల పంపిణీ

రాష్ట్రంలో పాల దిగుబడిని పెంచేందుకు పశుసంవర్థకశాఖ రూ.2వేల కోట్లతో కొత్త పథకాన్ని అమలు చేయనుంది. HYD మినహాయించి అన్ని జిల్లాల్లో ఈ పథకం అమలు అవుతుంది. ప్రతి జిల్లాలో ఏటా 830 మంది రైతులకు 2 చొప్పున ఆవులను సబ్సిడీపై అందించనున్నారు. మూడేళ్లలో మొత్తం 79,680 మంది లబ్ధిదారులను ఎంపిక చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఒక్క యూనిట్ ఖర్చు రూ.2,51,000గా అంచనా వేయగా 50% రైతు 50% సబ్సిడీ అందిస్తుంది.


