News April 11, 2025
కన్నుల పండువగా రాములోరి కళ్యాణం

ఒంటిమిట్టలో సీతారాముల కళ్యాణం కన్నుల పండువగా జరిగింది. లక్షలాది భక్తులు తరలిరాగా మంగళవాయిద్యాల నడుమ అంగరంగ వైభవంగా అర్చకులు కళ్యాణం నిర్వహించారు. ఈ అపూర్వ ఘట్టాన్ని తిలకించి భక్త జనం పులకించిపోయారు.
Similar News
News July 10, 2025
KCRకు వైద్య పరీక్షలు పూర్తి

TG: BRS అధినేత, మాజీ సీఎం KCRకు వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. సోమాజిగూడ యశోద ఆస్పత్రి నుంచి నందినగర్లోని ఆయన నివాసానికి వెళ్లారు. ఈనెల 3న ఆయన అస్వస్థతతో ఆస్పత్రిలో చేరగా ఆరోగ్యం మెరుగ్గానే ఉందని, సోడియం లెవల్స్ కొద్దిగా పెరిగాయని వైద్యులు నిర్ధారించారు. రెండు రోజుల చికిత్స అనంతరం 5వ తేదీన డిశ్చార్జ్ చేశారు. మరోసారి టెస్టుల కోసం రావాలని డాక్టర్లు సూచించడంతో ఇవాళ KCR ఆస్పత్రికి వెళ్లారు.
News July 10, 2025
లగ్జరీ అపార్ట్మెంట్ కొన్న జొమాటో ఫౌండర్.. ధర రూ.52.3 కోట్లు!

జొమాటో ఫౌండర్ దీపిందర్ గోయల్ హరియాణాలోని గురుగ్రామ్లో ₹52.3కోట్లతో సూపర్ లగ్జరీ అపార్ట్మెంట్ కొన్నారు. DLF సంస్థ నిర్మించిన ‘ది కామెల్లియాస్’ రెసిడెన్షియల్ సెక్టార్లో ఈ అపార్ట్మెంట్ ఉంది. దీని విస్తీర్ణం 10,813 స్క్వేర్ ఫీట్లు. ఇందులో 5 పార్కింగ్ స్పేస్లు ఉంటాయి. దీపిందర్ 2022లోనే దీనిని కొనుగోలు చేశారు. ఈ ఏడాది MARలో రిజిస్ట్రేషన్ పూర్తయింది. ₹3.66cr స్టాంప్ డ్యూటీ చెల్లించినట్లు సమాచారం.
News July 10, 2025
GWL: ‘ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించాలి’

ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన పథకాలపై అవగాహన కల్పించి, వాటిని సద్వినియోగం చేసుకునే విధంగా ప్రోత్సహించాలని కలెక్టర్ సంతోశ్ పేర్కొన్నారు. ఐడీఓసీ మందిరంలో గురువారం వ్యవసాయంలో మౌలిక సదుపాయాల కల్పన గురించి అవగాహన సదస్సు నిర్వహించారు. రైతుల ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వ పథకాలు కీలకం కావడంతో వాటిని రైతులకు చేరవేసి సద్వినియోగం చేసుకునేలా సంబంధిత అధికారులు కృషి చేయాలన్నారు.