News January 14, 2026
కపిలతీర్థం ఆలయ అర్చకులు సేవలు క్రమబద్ధీకరణ

తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామి వారి ఆలయ అర్చకులు సేవలు క్రమబద్ధీకరణ చేస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. మణివాచకర్ గురుకుల్, స్వామినాథన్ గురుకుల్ మిరాసియేతర అర్చకులుగా పనిచేస్తున్నారు. వారి సేవలను క్రమబద్ధీకరణ కోసం టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకుని ప్రభుత్వానికి పంపగా.. ప్రభుత్వం మంగళశారం జీవో విడుదల చేసింది.
Similar News
News February 1, 2026
నెయ్యిని నాభి వద్ద రాస్తే..

నెయ్యిని నాభికి అప్లై చేస్తే.. చర్మం పొడిబారడం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే పీరియడ్స్ సమయంలో ఉన్నప్పుడు నాభికి గోరు వెచ్చని నెయ్యి అప్లై చేయడం వల్ల క్రాంప్స్ వల్ల కలిగే నొప్పి తగ్గుతుంది. కడుపు ఉబ్బరం, మూడ్ స్వింగ్స్ తగ్గుతాయి. ఫెర్టిలిటీ సమస్యలపై కూడా ఇది సానుకూల ప్రభావం చూపిస్తుందని చెప్తున్నారు. రోగనిరోధక శక్తిని పెంచే యాంటీ మైక్రోబయాల్ లక్షణాలు నెయ్యిలో ఉన్నాయి.
News February 1, 2026
ప్రమాదాల నివారణకు నూతన విధానం: కలెక్టర్

ప్రతి సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. ఈ నూతన విధానం ద్వారా రహదారి ప్రమాదాలు తగ్గించడంతో పాటు ప్రాణ రక్షణకు దోహదపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజలు స్వచ్ఛందంగా హెల్మెట్ ధరించే అలవాటు పెంపొందించుకోవాలని సూచించారు.
News February 1, 2026
పోలవరం ఎత్తు తగ్గింపుతో తీరని నష్టం: బుగ్గన

AP: పోలవరం ఎత్తు 41.15 మీటర్లకు తగ్గిస్తున్నట్లు కేంద్రం పదేపదే చెబుతున్నా రాష్ట్రం తలూపుతూ ఊరుకోవడం సరికాదని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ విమర్శించారు. దీనివల్ల భవిష్యత్తులో నష్టం వాటిల్లుతుందన్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి ఎత్తు 45.72M అన్నారు. కాగా బడ్జెట్ నిరాశపర్చిందని YCP MP అవినాశ్ రెడ్డి పేర్కొన్నారు. పోలవరానికి ₹3వేల కోట్లే ఇచ్చారని, ఇలా అయితే అది ఎప్పటికి పూర్తవుతుందని ప్రశ్నించారు.


