News October 10, 2024
కమలాపురం మాజీ MLA కుమార్తెపై చర్యలు..!

వైసీపీ నేత, కమలాపురం మాజీ MLA వీరశివారెడ్డి కుమార్తె వీర మృణాళినిదేవి దువ్వూరు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో సీనియర్ అసిస్టెంట్గా ఉన్నారు. 2023 ఆగస్టు 21 నుంచి 2024 ఫిబ్రవరి 19 వరకు ముద్దనూరు ఇన్ఛార్జ్ సబ్ రిజిస్ట్రార్గా కొనసాగారు. జమ్మలమడుగు, ఎర్రగుంట్లలో ఆమె అక్రమంగా 57 రిజిస్ట్రేషన్లు చేయగా వీటిని కలెక్టర్ శివశంకర్ రద్దు చేశారు. ఆమెపై చర్యలు తీసుకోవడానికి అధికారులు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
Similar News
News July 6, 2025
MLA వరదకు సర్జరీ.. కాల్ చేసి మాట్లాడిన CM

ప్రొద్దుటూరు MLA వరదరాజులరెడ్డి గుండె ఓపెన్ సర్జరీ చేయించుకుని HYD ఆస్పత్రిలో కోలుకుంటున్నారు. విషయం తెలుసుకున్న CBN శనివారం వరదకు కాల్ చేసి ఆరోగ్య పరిస్థితిని గురించి తెలుసుకున్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే త్వరగా కోలుకుని మళ్లీ ప్రజాసేవలోకి రావాలంటూ ఆకాంక్షించినట్లు సమాచారం.
News July 6, 2025
కడప: ఈ నెల 10న మెగా పేరెంట్ టీచర్స్ కమిటీ సమావేశం

విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేందుకు ఈ నెల 10న జరిగే మెగా పేరెంట్ టీచర్ కమిటీ సమావేశాలను విజయవంతం చేయాలని కలెక్టర్ శ్రీధర్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్ అదితిసింగ్తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతోందన్నారు. అన్ని పాఠశాలలో మెరుగైన వసతులతో పాటు సన్నబియ్యంతో భోజనం అందిస్తున్నామన్నారు.
News July 6, 2025
ఈనెల 7న కడపకు YS జగన్

ఈనెల 7వ తేదీ కడప జిల్లాకు మాజీ ముఖ్యమంత్రి YS జగన్ వస్తున్నట్లు ఆయన వ్యక్తిగత కార్యదర్శి కే.నాగేశ్వర్రెడ్డి తెలిపారు. 7వ తేది మధ్యాహ్నం బెంగళూరు నుంచి హెలికాప్టర్లో పులివెందుల చేరుకుంటారు. రాత్రికి అక్కడే బస చేసి 8న ఉదయం ఇడుపులపాయకు చేరుకుంటారన్నారు. మహానేత YS రాజశేఖర్రెడ్డి జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పిస్తారని అన్నారు. అనంతరం పులివెందులకు మీదుగా బెంగళూరుకు చేరుకుంటారన్నారు.