News September 1, 2025
కమలాపురం: లోకేశ్ పర్యటన ఇలా..!

మంత్రి నారా లోకేశ్ కమలాపురం నియోజకవర్గంలో ఈనెల 2వ తేదీన పర్యటించనున్నారు. ఉదయం10.30 గంటలకు పెండ్లిమర్రి డిగ్రీ కళాశాల భవనాలు ప్రారంభిస్తారు. 11.35కు కొప్పర్తిలో ఓ కంపెనీని ప్రారంభించి 12.20కి చింతకొమ్మదిన్నె మండలం జమాల్ పల్లెకు చేరుకుంటారు. సెంట్రల్ కిచెన్ ఓపెన్ చేసి మధ్యాహ్నం 2గంటలకు చింతకొమ్మదిన్నె మండలం కొలుమలపల్లెలో జరిగే బహిరంగ సభకు హాజరవుతారు.
Similar News
News September 3, 2025
జగన్ పర్యటనలో ప్రత్యేక ఆకర్షణగా ప్లకార్డులు

YSR వర్ధంతి వేడుకలకు, జిల్లా పర్యటనకు విచ్చేసిన మాజీ సీఎం YS జగన్ పర్యటనలో మహిళలు ప్రదర్శించిన ప్లకార్డు ప్రత్యేకంగా నిలిచింది. మంగళవారం ఉదయం జగన్ పులివెందుల పర్యటనలో ఓటర్ల స్వేచ్ఛను హరించిన చంద్రబాబు అని మహిళలు ప్లకార్డును ప్రదర్శించారు. మహిళలు ప్రదర్శించిన ప్లకార్డు వైపు జగన్ ఆసక్తిగా చూశారు.
News September 2, 2025
కడప: అంగన్వాడీ సిబ్బందికి వేతనాలు పెంచాలని మంత్రి లోకేశ్కు వినతి

అంగన్వాడీ సిబ్బందికి వేతనాలు పెంచి ఆదుకోవాలని అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్, యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మీదేవి అన్నారు. మంగళవారం జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రి లోకేశ్ను అంగన్వాడీలు కలిశారు. అంగన్వాడీ కేంద్రాలకు సన్న బియ్యం ఏర్పాటు చేయాలని, వేతనాలు పెంచాలని కోరారు. ఇoదుకు స్పందించిన మంత్రి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగవ్వగానే వేతనాలు పెంచుతామన్నారు.
News September 2, 2025
చింతకొమ్మదిన్నె: ‘విద్యార్థులతో ముచ్చటించిన మంత్రి లోకేశ్

చింతకొమ్మదిన్నె మండలంలో ఏర్పాటు చేసిన స్మార్ట్ కిచెన్ను మంత్రి నారా లోకేశ్ ప్రారంభించారు. అనంతరం ఆయన స్థానిక పాఠశాల విద్యార్థులతో ముచ్చటిస్తూ, వారి ఆశయాలు, లక్ష్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యకు ప్రాధాన్యత ఇచ్చుకుంటూ ముందుకు సాగాలని సూచించారు. విద్యార్థుల సందేహాలకు సమాధానమిస్తూ, ప్రభుత్వ కార్యక్రమాలు గురించి వివరించారు. విద్యార్థులు మంత్రి మాటలతో ఉత్సాహం పొందారు.