News February 12, 2025
కమలాపూర్లో అత్యధికం.. పరకాలలో అత్యల్పం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739335044811_18267524-normal-WIFI.webp)
హన్మకొండ జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణ కోసం అధికారులు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లాలో మొత్తం 129 ఎంపీటీసీ, 12 జడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. వీటి కోసం కమలాపూర్ మండలంలో 90 పోలింగ్ కేంద్రాలు, శాయంపేటలో-61, ఆత్మకూరు-50, పరకాల-26, వేలేరు-29, దామెర-36, ఎల్కతుర్తి-59, నడికూడ-47, భీమదేవరపల్లి-69, హసన్పర్తి-40 ధర్మసాగర్-65, ఐనవోలు మండలంలో 59 పోలింగ్ కేంద్రాలు ఉండనున్నాయి.
Similar News
News February 12, 2025
ర్యాగింగ్ భూతాలు: మర్మాంగాలకు డంబెల్స్ వేలాడదీసి…
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739344349277_1199-normal-WIFI.webp)
కేరళ కొట్టాయం నర్సింగ్ కాలేజీలో దారుణం జరిగింది. తిరువనంతపురానికి చెందిన ముగ్గురు ఫస్టియర్ స్టూడెంట్స్ను ఐదుగురు థర్డ్ ఇయర్ సీనియర్లు ర్యాగింగ్ చేశారు. బట్టలిప్పించి వారి మర్మాంగాలకు డంబెల్స్ వేలాడదీశారు. అక్కడితో ఆగకుండా గాయాలకు కెమికల్స్ పూశారు. నొప్పి భరించలేక అరుస్తుంటే నోట్లోనూ స్ప్రే చేశారు. డబ్బులు దోచుకున్నారు. చంపేస్తామని బెదిరించినా తట్టుకోలేని స్టూడెంట్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
News February 12, 2025
త్వరలో రాజ్యసభకు కమల్ హాసన్!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739343504148_1199-normal-WIFI.webp)
మక్కల్ నీది మయ్యమ్ (MNM) అధినేత, సినీ స్టార్ కమల్ హాసన్ త్వరలో రాజ్యసభలో అడుగు పెట్టనున్నారు. ఆయనతో పాటు మరొకరికీ అవకాశం ఉంటుందని తెలిసింది. 2024 లోక్సభ ఎన్నికలప్పుడు అధికార DMKతో MNM పొత్తు పెట్టుకుంది. బదులుగా కమల్ను రాజ్యసభకు పంపిస్తామని CM MK స్టాలిన్ హామీ ఇచ్చారు. ఇదే విషయాన్ని నేడు DMK మంత్రి ఒకరు, అధికార ప్రతినిధి ధ్రువీకరించారు. MNM నుంచి మరొకరికీ అవకాశమిస్తామని పేర్కొన్నారు.
News February 12, 2025
HYD: కోర్ వైపు కష్టమే.. అంతా కంప్యూటర్ వైపే..!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739324540521_15795120-normal-WIFI.webp)
HYD, RR, MDCL కాలేజీల్లో మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్, ఎలక్ట్రానిక్ తదితర కోర్ బ్రాంచీల్లో ఇంజినీరింగ్ సీట్లు భారీగా పడిపోతున్నాయి. విద్యార్థుల ఆలోచనను పసిగట్టి, కోర్ బ్రాంచీలు తీసేసి కంప్యూటర్ కోర్సుల వైపు కాలేజీలు మొగ్గు చూపుతున్నాయి.వచ్చే ఏడాదికి తమకు AI, కంప్యూటర్ సైన్స్ (CSE)లాంటి కోర్సులు నడిపేందుకు పర్మిషన్ కావాలని సుమారు 15కు పైగా కాలేజీలు దరఖాస్తులు పెట్టుకున్నాయి.